‘దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు’
కానిస్టేబులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 22న రాతపరీక్ష నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
పరీక్ష కేంద్రం పరిశీలిస్తున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అధికారులు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : కానిస్టేబులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 22న రాతపరీక్ష నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఏసీ కళాశాల, జేకేసీ, మాజేటి గురవయ్య, బండ్లమూడి హనుమాయమ్మ తదితర కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు ఆదేశించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని 44 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ తదితర అక్రమాలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. దళారులు, మాయగాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టామన్నారు. ఆ తరహాలో ఎవరైనా దళారులు సంప్రదిస్తే స్థానిక పోలీసులకు తెలపాలన్నారు. ఎస్పీ వెంట ఆచార్యులు సిద్ధయ్య, ఏఎస్పీ అనిల్కుమార్, డీఎస్పీలు, సీఐలు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!