ఇల్లే బృందావనం
ఆకుపచ్చని లోకంలో అందాల హరివిల్లులా ఇల్లు కళకళలాడుతూ ఉండాలని ఎవరు కోరుకోరు. కాంక్రీటు అడవుల్లాంటి అపార్ట్మెంట్లలో ఉంటున్నందున చుట్టూ ఎటు చూసినా గుప్పెడు మట్టి కూడా కనిపించదు.
అపార్ట్మెంట్లో ఫ్లాట్నూ అందంగా తీర్చిదిద్దిన మహిళ
గుంటూరు సాంస్కృతికం, న్యూస్టుడే
గది పక్కన ఖాళీ జాగాలో మొక్కల పెంపకం
ఆకుపచ్చని లోకంలో అందాల హరివిల్లులా ఇల్లు కళకళలాడుతూ ఉండాలని ఎవరు కోరుకోరు. కాంక్రీటు అడవుల్లాంటి అపార్ట్మెంట్లలో ఉంటున్నందున చుట్టూ ఎటు చూసినా గుప్పెడు మట్టి కూడా కనిపించదు. మరి ఆకు పచ్చని లోకం ఎలా సాధ్యం అనే సామాన్యుల ప్రశ్నకి ఆర్.ధర్మవతి ఓ పరిష్కారం చూపిస్తున్నారు. గుంటూరు బ్రాడీపేట 18వ అడ్డరోడ్డులోని సూర్యోదయ అపార్ట్మెంట్లో నివాసం ఉంటారు ధర్మవతీరాము. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రేమ. నగర వాతావరణంలో అపార్ట్మెంట్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆమె నిరుత్సాహ పడలేదు. మొక్కలపై తనకున్న ప్రేమ, పరిజ్ఞానాలను మేళవించి ఇండోర్ ప్లాంట్ల పెంపకంపై దృష్టి సారించారు. 1,750 చదరపు అడుగుల పరిధిలో వరండా మొదలు, చుట్టూ బాల్కనీలో లివింగ్, డ్రాయింగ్ రూంలలో ఎలాంటి మొక్కలు పెడితే అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి మంచిదో బాగా ఆరా తీసి, సేకరించి చక్కగా అలంకరించారు. అంతూరియం, ఎడినియం, జెడ్ జెడ్ ప్లాంట్, పీస్ లిల్లీ, పోతాస్, తమలపాకు, ఫెర్న్, కాక్టస్, ఎరికా పామ్, వికీపీడియా, మందార, అలోవెరా, గ్రీన్ రోజా, చామంతి, జెడ్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, డిఫెన్స్ బెకియా, మల్లె, నీటి తామర ఇలా ఓ 150 రకాల మొక్కలు ఆ ఇంటిలోనూ, ఇంటి చూట్టూ కనిపిస్తాయి. అన్నీ రోజూ చిగురిస్తూ.. పూత పూస్తూ.. కాయలు కాస్తుంటాయి. ఆ పచ్చని ఆకులపై నుంచి పైరగాలిలా వీచే చల్లని గాలి కాంక్రీటు జనారణ్యాన్ని కనువిందుగా ఉండే నందనవనంలా మారుస్తుంటే ఆనందం ఆ ఇంటి వారికే కాక పొరుగు వారి సొంతం కూడా అవుతోంది.
పెంచుతున్న మొక్కలతో ధర్మవతి
ఆలోచిస్తే ఆనందం మన సొంతం
అపార్ట్మెంట్లలో ఉంటున్నామని, మొక్కలు పెంచే వీలే లేదని ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. దానికి నేనే ఉదాహరణ. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం. అపార్ట్మెంటే కొనుక్కోవలిసి వచ్చింది. అందులోనూ మూడో ఫ్లోర్లో. మనసుంటే మార్గం లేకపోదని మన వాళ్లంటారు కదా. అది నిజం. నా అభిరుచిని భర్త రాము కూడా ప్రోత్సహించారు. అప్పుడు జాగ్రత్తగా ఎక్కడ ఏ మొక్క అమర్చితే బాగుంటుందని ఆలోచించి కళాత్మకంగా ఉండేలా మధ్యమధ్యలో చక్కటి బొమ్మలను కూడా అమర్చుతూ మొక్కలను తీర్చిదిద్దాను. చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ స్ఫూర్తిని కూడా పొందుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ముందుగా నా కళ్లు కొత్త మొక్కల కోసం వెతుకుతుంటాయి. నేను ఎప్పుడూ మొక్కలు కొనుగోలు చేసే నర్సరీల యజమానులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అంత చిన్న జాగాలో ఇన్ని మొక్కలు ఎలా పెడుతుంటారని. అన్నిటికీ సమాధానం ఒక్కటే ఆసక్తి ఉండాలంతే. అప్పుడు మొక్కలన్నీ మన పాపల్లానే నవ్వుతూ చిగురాకుల చేతులూపుతూ కనిపిస్తాయి. అలా ఉన్న ఇల్లు నందనవనమేగా మరి అంటున్నారు ధర్మవతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.