బోధనేతర విధులే ముద్దు
సమగ్ర శిక్షలో క్లస్టర్ రిసోర్సుపర్సన్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఇలా ఎంతోమంది ఉన్నారు. వారితో చేయించాల్సిన పనులను ఉపాధ్యాయులతో చేయించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
15 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు
సీఎం ఆదేశాలు భేఖాతర్.. డీఈవో తీరుపై విమర్శలు
ఈనాడు-నరసరావుపేట
సమగ్ర శిక్షలో క్లస్టర్ రిసోర్సుపర్సన్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఇలా ఎంతోమంది ఉన్నారు. వారితో చేయించాల్సిన పనులను ఉపాధ్యాయులతో చేయించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటప్పయ్య ఆ జిల్లా పరిధిలోని 15 మంది ఉపాధ్యాయులను జేవీకే కిట్లలో ఉండే సామగ్రిని కాంపొనెంట్ వారీగా పర్యవేక్షించడానికి డిప్యూటేషన్పై డీఈవో కార్యాలయంలో విధులు నిర్వహించడానికి తీసుకోవటం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉపాధ్యాయవర్గం, సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు పాఠశాలల్లో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబితే అందుకు విరుద్ధంగా డీఈవో స్థాయిలోనే టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం ప్రశ్నార్థకమవుతోంది. ఈ డిప్యూటేషన్లు ప్రస్తుతం జిల్లా ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. దాన్ని నివారించటానికి గతేడాది అక్టోబరులో పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్లు ఇవ్వని టీచర్లకు ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించి సబ్జెక్టు టీచర్లుగా వారిని ఆయా పాఠాలలకు సర్దుబాటు చేశారు. అయినా ఇంకా ఖాళీలు పేరుకుపోవటంతో సెకండరీ గ్రేడ్ టీచర్లలో మంచి విద్యార్హతలు కలిగిన సీనియర్లను గుర్తించి వారికి నెలకు రూ.2500 చొప్పున అలవెన్సులు ఇస్తామని వారిని సబ్జెక్టు టీచర్లుగా తీసుకోవడానికి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు మొత్తానికి కలిపి గుంటూరులోని డీఈవో కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు టీచర్ల కొరత అంటుంటే అదేం పరిగణనలోకి తీసుకోకుండా పల్నాడు డీఈవో ఏరికోరి టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం విమర్శలకు దారితీసింది.
గతంలో 11 తాజాగా 15 మంది..
సీఎం కాదు కదా.. ఎవరు ఏం చెప్పినా.. తమ బాణీ తమదేననేలా విద్యాశాఖ అధికారుల తీరు ఉందనే అభిప్రాయం ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనే ఒకసారి 11 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ అనుమతితో డిప్యూటేషన్పై నరసరావుపేటలోని డీఈవో కార్యాలయానికి తీసుకోగా దీనిపై ఉన్నతాధికారులు, సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే వారి డిప్యూటేషన్లు రద్దు చేసి పాఠశాలలకు వెనక్కు పంపారు. అది జరిగి నెల రోజులు కూడా కాలేదు. తిరిగి మరోసారి 15 మంది ఉపాధ్యాయులను తీసుకోవడం గమనార్హం. అసలు ఈ డిప్యూటేషన్లకు కమిషనర్ అనుమతి లేదు. టీచర్ల డిప్యూటేషన్లకు కచ్చితంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అనుమతి పొందాలని స్పష్టమైన సర్క్యులర్ ఉంది. అది ఏ మాత్రం పట్టించుకోకుండా జిల్లా స్థాయిలోనే డిప్యూటేషన్లు వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 15 మంది రావటంతో కొన్ని స్కూళ్లలో ఏకోపాధ్యాయులే ఉన్నారని వారికి ఏదైనా అత్యవసరం వచ్చి సెలవు పెడితే ఆ రోజు పాఠశాల మూసివేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఉపాధ్యాయవర్గం గుర్తు చేస్తోంది. గతంలో వేసిన 11 మందిలో తాజాగా ఈసారి వేసిన డిప్యూటేషన్లలో కూడా ఆరుగురు ఉన్నారని తెలిసింది. వీరంతా నిత్యం నరసరావుపేట నుంచి ఆయా పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. నిత్యం ఆయా ప్రాంతాలకు వెళ్లి రావడం ఇబ్బందికరంగా ఉంటోందని చెప్పి వారే డిప్యూటేషన్లపై తీసుకునేలా లాబీయింగ్ చేశారని ప్రచారం లేకపోలేదు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడుకోవద్దని ఉత్తర్వులున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా పల్నాడు డీఈవో టీచర్లను బోధనేతర విధులు పర్యవేక్షించేలా డిప్యూటేషన్లు వేయటం సరైన విధానం కాదని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షుడు బసవ లింగారావు, మక్కెన శ్రీనివాసరావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!