ఎమ్మెల్యే కోనపై అసమ్మతి గళం
బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సాక్షిగా అధికార వైకాపాలో లుకలుకలు బయటపడ్డాయి.
మాజీ మంత్రి గాదె, మాజీ ఎమ్మెల్యే చీరాలతో సమావేశమైన ప్రాంతీయ
సమన్వయకర్తలు భూమన కరుణాకర్రెడ్డి, బీద మస్తాన్రావు
బాపట్ల, న్యూస్టుడే: బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సాక్షిగా అధికార వైకాపాలో లుకలుకలు బయటపడ్డాయి. ప్రాంతీయ సమన్వయకర్తలు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, నియోజకవర్గ పరిశీలకుడు గజ్జల బ్రహ్మారెడ్డి సమక్షంలో అధికార పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిపై తమ అసంతృప్తి, ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం. స్థానిక రైస్మిల్లర్ల సంఘం కార్యాలయంలో నియోజకవర్గంలో ఎంపిక చేసిన 120 మంది స్థానిక నేతలను సమన్వయకర్తలు విడివిడిగా కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యవహారశైలి, పనితీరుపై ఐప్యాక్ బృందం సమక్షంలో అభిప్రాయాలు సేకరించారు.
రెడ్డి సామాజికవర్గ నేతల ఆగ్రహం
తొలుత బాపట్ల పట్టణంలోని పటేల్నగర్కు సమన్వయకర్తలు భూమన, బీదా, పరిశీలకుడు బ్రహ్మారెడ్డి వెళ్లి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిని ఆయన గృహంలో కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోనాను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ మోదుగుల బసవపున్నారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు కళ్లం హరనాథరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియజేయటం లేదని, అందరినీ కలుపుకొని వెళ్లకుండా రఘుపతి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని సమన్వయకర్తలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కొందరిని చేరదీసి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని దూరంగా పెట్టారని చెప్పుకొచ్చారు. కోన వ్యవహారశైలితో బాపట్లలో వైకాపా బలహీనపడుతోందని చెప్పినట్లు సమాచారం. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నా పార్టీ కోసం మిన్నకుండిపోయినట్లు తెలిపారు. బయటపడి రోడ్డుకెక్కితే పార్టీ పరువుపోతుందని, సీఎం జగన్ మీద అభిమానంతో అమమానాలన్నింటిని మౌనంగా భరిస్తున్నామని పేర్కొన్నట్లు తెలిసింది. సమన్వయకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి తమను ఎవరినీ పిలవలేదని, పార్టీని భజనపరులతో నింపుతూ వైకాపా కోసం కష్టపడుతున్న నేతలు, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికారుల పోస్టింగుల్లోనూ ఓ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ మిగతావారందరినీ పక్కన పెట్టటం వల్ల వైకాపాకు చెడ్డపేరు వచ్చిందని చెప్పారు.
వాపోయిన నాయకులు : అనంతరం రైస్మిల్లర్ల సంఘం కార్యాలయంలో వైకాపా జిల్లా కన్వీనర్ మోపిదేవి వెంకటరమణారావుతో కలిసి పట్టణం, మూడు మండలాల పరిధిలోని పార్టీ నేతలతో సమన్వయకర్తలు సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించారు. ఓ ప్రజాప్రతినిధి తనను ఎమ్మెల్యే కోన, ఆయన వర్గీయులు, అధికారుల ద్వారా అవమానించిన తీరును సమన్వయకర్తలకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ అవమానాలు కొనసాగుతున్నాయని చెప్పి వాపోయారు. ఐప్యాక్ సిబ్బందితో కలిసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అర్హులై ఉండి ఎవరికైనా ఇళ్ల స్థలాలు, నవరత్న పథకాలను ఎమ్మెల్యే ఆపించారా అని పలువురు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ నేత మాట్లాడుతూ ఎమ్మెల్యే తనకు కావాల్సిన ఇద్దరు, ముగ్గురికే పెద్ద పీట చేస్తూ మిగతావారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోన సమావేశ హాలు బయటే ఉండిపోయారు.సమావేశానికి వైకాపా పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్కు ఆహ్వానం ఉన్నా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
[ 23-04-2024]
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
జగన్.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల
[ 23-04-2024]
ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
తెదేపా నేతపై ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
[ 23-04-2024]
బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
[ 23-04-2024]
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్