నేర వార్తలు
సత్తెనపల్లి మండలం గోరంట్లలో రోజు వ్యవధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలు కాగా బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మద్యం రేపిన కల్లోలం
రోజు వ్యవధిలో దంపతుల ఆత్మహత్య
సోదరుడు నాగఅభిమన్యుతో నందిని
సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్టుడే: సత్తెనపల్లి మండలం గోరంట్లలో రోజు వ్యవధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలు కాగా బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్రోసూరు మండలం 88తాళ్లూరుకు చెందిన మాగంటి వెంకట సుబ్బారావు (38), అమరావతికి చెందిన శివలక్ష్మి (33) వారి తొలి వివాహాల్లో జీవిత భాగస్వాములు కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం ఇరువురి పెద్దలు సుబ్బారావు-శివలక్ష్మికి సంబంధం కుదిర్చి వివాహం చేశారు. రెండేళ్ల నుంచి సత్తెనపల్లి మండలం గోరంట్లలో నివాసం ఉంటున్నారు. ఆయన పొలం కౌలుకు తీసుకుని పంటల సాగు చేపట్టారు. నష్టాలు రావడంతో భవన నిర్మాణ కూలి పనులకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో మద్యం తాగుతూ సొమ్ము వృథా చేయసాగారు. ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఆమెపై శనివారం ఆయన చేయి చేసుకున్నారు. మనస్తాపానికి గురైన శివలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం శవమై కనిపించారు. తమ కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని శివలక్ష్మి తల్లి పెద్దిబోయిన ఆదిలక్ష్మి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా గ్రామీణ ఎస్సై ఆవుల బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో క్రోసూరు సమీపంలోని విద్యుత్తు కేంద్రం వద్ద వెంకట సుబ్బారావు సోమవారం పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజు వ్యవధిలో దంపతులు విగతజీవులుగా మారడంతో ఇరువురి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారివురికి జన్మించిన నాగఅభిమన్యు (4) శివలక్ష్మికి తొలి వివాహంలో కలిగిన నందిని (15) అనాథలయ్యారని ఆవేదన చెందుతున్నారు. బాలిక కట్టమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, బాలుడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు.
ఉరేసుకొని వివాహిత బలవన్మరణం
పిల్లలు కలగలేదని అత్తింటి వేధింపులు
రాధ (పాతచిత్రం)
కొల్లూరు: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరులోని యాదవపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెదకమ్మవారిపాలేనికి చెందిన డొక్కు రాధ (25)కు కొల్లూరుకు చెందిన కోటేశ్వరరావుతో 2018లో వివాహమైంది. వీరికి ఇంతవరకు పిల్లలు కలగకపోవడంతో భర్త, అత్త శివపార్వతి, ఆడపడుచు కొలుసు తిరుపతమ్మ నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన రాధ ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఆరేవరపు సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శామ్యూల్ రాజీవ్కుమార్ తెలిపారు.
రైలు పట్టాల వద్ద వృద్ధుడి మృతదేహం
చీరాల నేరవిభాగం, న్యూస్టుడే: రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెంది ఉన్నాడు. ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం... వేటపాలెం-చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య ఓ వ్యక్తి(60) మృతదేహం పట్టాల పక్కన పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఒంటిపై పసుపు, తెలుగు, ఆకుపచ్చ, ఉదా రంగు పూర్తిచేతుల చొక్కా ధరించి ఉన్నాడన్నారు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు లుంగీపై తెలుపు, ఎరుపు, పసుపు పువ్వులు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
పిడుగురాళ్ల: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గుంటూరు రోడ్డులో పెట్రోలు బంకు ఎదురుగా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కరాలపాడు గ్రామానికి చెందిన వడ్లవల్లి ఖాశీం (80) కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీలో శుభకార్యానికి వచ్చారు. అల్పాహారం కోసం గుంటూరు రోడ్డులోని పెట్రోలు బంకు ఎదురుగా రోడ్డు దాటుతుండగా కొండమోడు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుమారుడు జానీ ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
రెంటచింతల, న్యూస్టుడే: మండల పరిధి మంచికల్లులో విద్యుదాఘాతానికి గురై ఒక కార్మికుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మాచర్లకు చెందిన తుమ్మల లక్ష్మయ్య (43) ఆదివారం మంచికల్లులో ఇంటి నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారు. మిల్లర్కు నీరు పెట్టేందుకు మోటారు వేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆయనను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సమీర్ బాషా తెలిపారు. లక్ష్మయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హత్య కేసులో జీవిత ఖైదు, జరిమానా
గుంటూరు లీగల్ న్యూస్టుడే : ప్రత్తిపాడు మండలం, తమ్మలపాలెంకు చెందిన కొనంక్కి పవన్ కుమార్ హత్యకేసులో మంగళగిరి మండలం నవులూరుకు చెందిన తలతోటి సోమశేఖర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు మూడో అదనపు జిల్లా జడ్జి జి.అర్చన సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నవులూరుకు చెందిన సోమశేఖర్ ఓ సెల్ఫోన్ కంపెనీలో పనిచేసేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గతంలో తెనాలిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడు. తుమ్మలపాలెంకు చెందిన పవన్కుమార్ క్రోసూరులో ఉన్న తన పొలాన్ని విక్రయించాడు. ఆ నగదును స్థిరాస్తి వ్యక్తుల ద్వారా తలతోటి సోమశేఖర్కు ఇచ్చాడు. నవులూరు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఇంటిని తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తరువాత తన చెల్లి వివాహ నిమిత్తం డబ్బులు చెల్లించమని పవన్కుమార్ సోమశేఖర్పై ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో 2016 మే, 16న పథకం ప్రకారం సోమశేఖర్ పవన్కుమార్ను మంగళగిరి పిలిపించాడు. మద్యం తాగించి పవన్కుమార్ తలపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా సోమశేఖర్ తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, శ్రీనివాసరావు నాయనమ్మ అన్నపూర్ణ అతనికి సహకరించారు. పవన్కుమార్ మృతదేహన్ని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి పెట్రోలు పోసి శవాన్ని దహనం చేశారు. ఈలోగా తన భర్త కనిపించడం లేదని పవన్కుమార్ భార్య ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత కేసు మంగళగిరి రూరల్ పొలీసులకు బదిలీ కాగా కేసు దర్యాప్తు చేశారు. సోమశేఖర్తోపాటు అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితుల్లో సోమశేఖర్పై నేరం రుజువు చేయడంతో అతనికి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ మిగిలిన వారిపై కేసును కొట్టివేస్తూ జడ్జి అర్చన తీర్పు చెప్పారు.
రౌడీషీటర్ రెహ్మాన్పై పీడీ చట్టం
బాపట్ల, న్యూస్టుడే: పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన రౌడీషీటర్ రెహ్మాన్పై పీడీ చట్టాన్ని అమలు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుండటంతో కలెక్టర్ విజయకృష్ణన్ అనుమతితో రౌడీషీటర్ రెహ్మాన్పై పీడీ చట్టాన్ని ప్రయోగించామన్నారు. రౌడీషీటర్లు, మాజీ నేరస్థుల కదలికలపై నిఘా ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 మందిపై పీడీ చట్టాన్ని అమలు చేశామని, అందులో 13 మంది సారా తయారీదారులు, ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.