లంక గ్రామాల్లో వెలుగులు నిలిచేనా?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితమైన ప్రణాళికలు
ఈనాడు-అమరావతి
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి. నదికి 6లక్షల క్యూసెక్కుల నీరు వస్తే లంకగ్రామాలకు సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీంతో ఒకవైపు వర్షం.. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రాత్రివేళ లంకగ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. వరదల సమయంలో పర్యటించే నేతలు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దీంతో వరదల సమయంలో ఏటా లంకల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఈనేపథ్యంలో రెండేళ్ల కిందట లంక గ్రామాల్లో 6లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సుమారు రూ.10కోట్ల నిధులు అవసరమని అంచనాలు వేశారు. అప్పటినుంచి పలు సాంకేతిక కారణాలతో ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. కృష్ణానది కరకట్ట లోపలివైపు విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పనులు చేయడానికి జనవరి నుంచి మే వరకు అనుకూల సమయం. ఈనేపథ్యంలో ఈసారైనా పనులు చేపట్టాలని లంకల ప్రజలు కోరుతున్నారు.
దిమ్మెల ఎత్తు పెంచేలా ప్రణాళిక
కృష్ణానది కరకట్ట లోపల ఉన్న విద్యుత్తు నియంత్రికలు(ట్రాన్స్ఫార్మర్లు) నదికి 6లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తే ముంపునకు గురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో ఉన్న 430 నియంత్రికల దిమ్మెల ఎత్తు పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా నియంత్రికలు అమర్చిన 400 విద్యుత్తు స్తంభాలను కూడా 9.1 మీటర్లు ఉండేలా చూస్తారు. దీంతోపాటు 1000 జంక్షన్ స్తంభాలను కూడా మార్చనున్నారు. జువ్వలపాలెం, ఈపూరులంక గ్రామాల పరిధిలో ఉన్న మూడు విద్యుత్తు ఉపకేంద్రాల ఎత్తును పెంచుతారు. వరద సమయంలో ఇవి ముంపునకు గురికావడంతోపాటు సిబ్బంది యార్డులోకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపకేంద్రం ఎత్తు పెంచడంతోపాటు ఎంత వరద వచ్చినా యార్డులోకి వెళ్లే విధంగా ర్యాంపు కూడా ఏర్పాటుచేస్తారు. లంక గ్రామాల వెంబడి అవసరమైనచోట 12 మీటర్ల స్తంభాలు వేస్తారు. అదేవిధంగా దశాబ్దాల కింద వేసిన తీగలు కావడంతో మొత్తం మార్చి కొత్త లైన్లు వేయాలన్న ప్రతిపాదనలు కూడా చేశారు. వీటన్నిటికి కలిపి రూ.10కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. రెండేళ్ల కిందట పంపిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు.
ఇబ్బందులు ఎన్నెన్నో..
కృష్ణానది కరకట్ట లోపల పదుల సంఖ్యలో లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత సారవంతమైన భూములు కావడంతో వాణిజ్యపంటలు పండుతున్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి వంటి పంటలు విస్తారంగా పండిస్తారు. ఇక్కడి వ్యవసాయం అంతా బోరుబావులపై ఆధారపడి ఉంటుంది. దీంతో లంక గ్రామాల్లోనే విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. స్థానికంగా వర్షాలు లేకపోయినా కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. కృష్ణానదికి 6లక్షల క్యూసెక్కుల నీరు వస్తే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తారు. ఈసమయంలో నాలుగైదు రోజుల పాటు సరఫరాకు అంతరాయం కలిగితే స్థానికంగా పంటలకు నీటితడులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. నదిలోచుట్టూ నీరున్నా పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవు. నదికి వరద సమయంలో గ్రామం చుట్టూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదిలో ఉన్న పాములు, విషపురుగులు ఒడ్డుకు చేరే క్రమంలో గ్రామం పరిసరాల్లోకి చేరుకుంటాయి. రాత్రివేళ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వరద ఆగిన తర్వాత కూడా విద్యుత్తు పరికరాలు అన్నీ పరీక్షించి సరఫరాకు ఇబ్బంది లేదని గుర్తించిన తర్వాతే పునరుద్ధరిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పడుతోంది. వీటన్నిటికి పరిష్కారం చూపాలని కొన్నేళ్లుగా లంక వాసులు కోరుతూనే ఉన్నారు. వేసవికాలంలో నదిలో నీరు తగ్గిపోతున్నందున విద్యుత్తు పరికరాల రవాణా, అమరికకు సౌకర్యంగా ఉంటుంది.
ప్రతిపాదనలు పంపాం
కృష్ణానదికి 6లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా కరకట్ట లోపల గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. గతంలో పంపిన ప్రతిపాదనలకు రూ.10కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. తాజాగా కొన్ని మార్పులు చేసి లైన్లు మార్చే అవసరం లేకుండా దిమ్మెలు ఎత్తుచేయడం, స్తంభాలు మార్చడం ద్వారా సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసేలా కసరత్తు చేసి పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడుతాం.
మురళీకృష్ణయాదవ్, పర్యవేక్షక ఇంజినీరు, విద్యుత్తుశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో