ఉక్కిరిబిక్కిరి..!
ఒకవైపు టీచర్ల బదిలీల నిర్వహణకు కావాల్సిన సమాచారం...మరోవైపు పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు...ఇంకోవైపు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వివరాలు.
రోజుకో సమాచారం అడుగుతున్న అధికారులు
బోధనకు ఆటంకం కలుగుతుందని హెచ్ఎంల ఆందోళన
ఈనాడు-అమరావతి
ఒకవైపు టీచర్ల బదిలీల నిర్వహణకు కావాల్సిన సమాచారం...మరోవైపు పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు...ఇంకోవైపు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వివరాలు..ఇలా ఒకదాని వెంట మరొకటి రోజుకో నమూనా ఇచ్చి ఆ సమాచారం వెంటనే పంపాలని విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చి పడుతున్న ఆదేశాలు ప్రధానోపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆ సమాచారం ఇవ్వడానికి తగు సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసుకుని విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలో అకడమిక్తో సంబంధం లేని రకరకాల సమాచారం అడగడం...అది అత్యవసరమని హడావుడి చేయడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం యూ-డైస్, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్) వివరాలు ఇవ్వాలని కోరడమే అందుకు నిదర్శనం. కమిషరేట్ నుంచి రోజుకో రకమైన వివరాలు కోరుతూ వస్తున్న ఆదేశాలు తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
ఉపాధ్యాయులపై ఆధారపడాల్సిందేగా..
ఉన్నతాధికారులు ఏ సమాచారం కోరినా దాన్ని సహచర ఉపాధ్యాయుల నుంచి సేకరించి ఇవ్వాల్సిందే తప్ప హెచ్ఎం ఒక్కరే వాటిని సిద్ధం చేయలేరు. దీంతో డేటా సేకరణలో ఉపాధ్యాయులు కూడా భాగస్వాములు కావడంతో కొన్ని స్కూళ్లలో బోధనకు ఆటంకం ఏర్పడుతోందని, రెగ్యులర్గా క్లాసులు చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. గడచిన వారం రోజుల నుంచి యూ-డైస్, స్కూల్ డెవలప్మెంట్ ప్రణాళికల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటపడుతున్నారు. ఈ వివరాలు పంపడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని గుంటూరు, పల్నాడు, బాపట్ల మూడు జిల్లాల డీఈవోలు పదేపదే చెబుతుండటంతో...హెచ్ఎంలు సహచర ఉపాధ్యాయులను పిలిచి ఈ వివరాలు ఇచ్చాకే బోధన చేయాలని ఆదేశిస్తున్నారు. రెండురోజుల్లో స్కూల్ డెవలప్మెంట్ ప్రణాళిక పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని కొందరు హెచ్ఎంలు చెబుతున్నారు.
కోరిన సమాచారమిదీ..
పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హేబిటేషన్ డెవలప్మెంట్, కాంప్లెక్సు డెవలప్మెంట్, మండల డెవలప్మెంట్ ప్రణాళికలు కోరారు. ఒక హేబిటేషన్ పరిధిలో 2-3 స్కూళ్లు ఉంటాయి. వాటి అభివృద్ధికి ఏం చేయాలి? కాంప్లెక్స్ పరిధిలో 12-13 పాఠశాలలు, మండల పరిధిలో 5-6 కాంప్లెక్సుల దాకా ఉంటాయి. ఇవి తయారు చేసి సమగ్రశిక్ష అధికారులకు అందజేస్తే జిల్లా స్థాయిలో రానున్న విద్యా సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ప్రతిపాదించి ఆమేరకు నిధులు కోరవచ్చు. అయితే ఈ సమాచారాన్ని సమగ్రశిక్షలో ఉండే సీఆర్పీలు, ఇంజినీరింగ్ అధికారులు, అకడమిక్ మోనటరింగ్ అధికారులు సేకరించి తుదిగా హెచ్ఎంలతో సమావేశమై చర్చిస్తే సరిపోతుందని...వారిని వదిలేసి అన్ని రకాల సమాచారాలు పాఠశాలల హెచ్ఎంలే ఇవ్వాలనడంతో బోధనపై అది ప్రభావం చూపుతోందని సీనియర్ ప్రధానోపాధ్యాయుడొకరు చెప్పారు. ఈ వివరాలు ఏటా నవంబరులోనే సేకరించేవారు. అలాంటిది ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇటీవల అడగడాన్ని తప్పుబడుతున్నారు. ప్రతి హేబిటేషన్ పరిధిలో 0-15 ఏళ్ల పిల్లల్లో ఎంతమంది అంగన్వాడీల్లో చేరారు..ఎంతమంది ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు...వారిలో దివ్యాంగులు ఎందరు...ఇతర ఊళ్ల నుంచి వచ్చే పిల్లలు ఎంతమంది..వారికి ఎస్కార్టు అలవెన్స్ ఇస్తున్నారా వంటి సమాచారం కోరారు. అదేవిధంగా ఆ ఊళ్లో అక్షరాస్యత శాతం..పిల్లల వయస్సుకు తగ్గట్లే వారు ఆయా క్లాసుల్లో ఉన్నారా...ఏమైనా ఓవర్ ఏజ్ ఉందా? బాల, బాలికల వారీగా వారి కులాలు, ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులు..వాటి గ్రేడ్లు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గదుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా టీచర్లు ఉన్నారా లేరా? క్రీడా వసతులు...సరిపడా బెంచీలు ఉన్నాయా, లేవా? లేబరేటరీ ఎక్విప్మెంట్, గ్రంథాలయాల్లో పుస్తకాల లభ్యత, కంప్యూటర్లు వివరాలు క్రోడీకరించి ఇవ్వాల్సి ఉండడంతో ఆ సమాచారం ఇవ్వడానికి కనీసం వారం, పది రోజులు పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
[ 29-03-2024]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
[ 29-03-2024]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు