అదృశ్య గ్రామాల అన్వేషకుడు.. శివశంకర్
ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు.
500 పల్లెల వివరాలతో పుస్తకం
ఈనాడు, అమరావతి
ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు గుంటూరుకు చెందిన మణిమేల శివశంకర్. అతను ఓ సాధారణ ముఠా కూలీ. మూటలు మోయడం అతని వృత్తి. కానీ గత చరిత్రపై అన్వేషణ చేయడం ప్రవృత్తి.
చదివింది ఐదో తరగతే... అయినా శాసనాలను పరిశీలించడం, అందులోని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాలగర్భంలో కలిసిపోయిన 500 గ్రామాల చరిత్రను వెలికితీశారు. ఎలాంటి డిగ్రీలు లేకపోయినా పరిశోధకుల కంటే మిన్నగా శ్రమించి అదృశ్య గ్రామాల చరిత్రను అక్షరబద్ధం చేశారు.
శివశంకర్ రాసిన పుస్తకం ఇదే
ఆసక్తిని అన్వేషణగా మార్చుకుని...
ఓవైపు బస్తాలు మోస్తూ ముఠాకూలీగా పనిచేస్తూనే విరామ సమయంలో అన్వేషణ సాగించారు. ఆరంభంలో ఆలయాలు తిరిగి చరిత్ర తెలుసుకునేవారు. అక్కడి శాసనాలపై ఆరా తీసేవారు. ఈక్రమంలో ఆలయాలకు దానంగా ఇచ్చిన గ్రామాల పేర్లు చాలావరకు ప్రస్తుతం మనుగడలో లేవని గుర్తించారు. అలాంటి మరుగన పడిన అదృశ్య గ్రామాల అన్వేషణ మొదలెట్టారు. 2018 నుంచి పరిశోధిస్తూ అనేక గ్రామాలు కలియతిరిగారు. గ్రంథాలయాల్లో అనేక వివరాలు సేకరించారు. శాసనాలు, కైఫియత్తుల నుంచి వివరాలు సేకరించారు. అనేక చారిత్రక పుస్తకాలను సమకూర్చుకున్నారు. ఈక్రమంలో కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈసమయంలో తాను అన్వేషించిన గ్రామాల వివరాలు అన్నీ అక్షరబద్ధం చేశారు. అదృశ్య గ్రామాల చరిత్ర, వాటికి ఆధారాలు ఇలా వివరాలన్నీ పొందుపరిచారు. వీటిని అదృశ్య గ్రామాలు పేరుతో 2022లో పుస్తకం తీసుకువచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. చిన్నతనంలో అమ్మమ్మ గారి ఊరైన బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఐదోతరగతి తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేశారు. జీవనోపాధి కోసం గుంటూరు వచ్చి ముఠా కార్మికుడిగా స్థిరపడ్డారు. దైవదర్శనం కోసం ఆలయాలకు వెళ్లే మణిశంకర్ అక్కడి స్థలపురాణం, చరిత్ర గురించి ఆరా తీసే అలవాటుగా మార్చుకున్నారు. తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. అమ్మమ్మ గారి ఊరైన భర్తిపూడిలో ఉన్నప్పుడు ఒకప్పుడు పేరుగాంచిన వెలిచర్ల, నేరేడుపల్లి, ములకపాడు గ్రామాల అదృశ్యంపై గ్రామంలోనే చర్చించుకునేవారు. చిన్నతనంలో శివశంకర్ మనసులో ఇది బలంగా నాటుకుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనే ఆలోచన చరిత్ర అన్వేషణకు పురికొల్పింది. శివశంకర్ గుంటూరు జిల్లాలోని ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు వెళ్లారు. అందుబాటులో ఉన్న రికార్డులను తిరగేశారు. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను (గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు) పేరుతో గ్రంథస్థం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామమైన పింగళి గురించి కూడా పుస్తకంలో పొందుపర్చారు. తెనాలి రామలింగకవి స్వస్థలం గార్లపాడు తెనాలి మండల గ్రామం కొలకలూరుకు సమీపంలోని అదృశ్యగ్రామమని తేల్చారు.
శాసనాల ఆధారంగా సేకరణ
శివశంకర్ పరిశోధనకు ప్రధాన ఆధారం శాసనాలు. పాత తెలుగు శాసనాలను చదివి అర్థం చేసుకోవడంలో పట్టు సాధించారు. సంస్కృతంలో శాసనాలు అర్థం కాకపోవడంతో తెలిసిన మిత్రుల సాయంతో అందులోని అంశాలను తెలుసుకున్నారు. పాత సాహిత్యం, కైఫియత్తులు, గెజిట్లలోని సమాచారం ఆధారంగా అదృశ్యగ్రామాల సంగతుల్ని గుర్తించారు. పుస్తకంలో అదృశ్యగ్రామాలు, విలీన గ్రామాలు, జంటగ్రామాలు, ప్రతినామ గ్రామాలు ఇలా ప్రత్యేక విభాగాలున్నాయి. పట్టణీకరణలో భాగంగా చాలా గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో కలిసిపోయాయి. అలాంటి గ్రామాల వివరాల్ని కూడా ఆయన పొందుపర్చారు. సమాచార సేకరణకు సమీకరించిన పుస్తకాలు మినీగ్రంథాలయాన్ని తలపిస్తున్నాయి.
వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం...
తన స్ఫూర్తితో చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొందరు ఔత్సాహికులు అదృశ్య గ్రామాలపై పరిశోధన చేస్తున్నట్లు శివశంకర్ తెలిపారు. కొలకలూరు శాసనాలు, వినుకొండ సీమ కరణికరపట్టిక పుస్తకాలు తీసుకు రావడానికి అధ్యయనం చేస్తున్నానన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1000 వరకు అదృశ్య గ్రామాలు ఉన్నాయని వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా