logo

సీఎం సభావేదిక ఖరారు

ఈనెల 30న సీఎం జగన్‌ జిల్లా వినుకొండలో చేదోడు పథకం నాలుగో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని తెలిపారు.

Published : 27 Jan 2023 04:47 IST

వినుకొండ, న్యూస్‌టుడే : ఈనెల 30న సీఎం జగన్‌ జిల్లా వినుకొండలో చేదోడు పథకం నాలుగో విడత లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. గురువారం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డితో కలిసి స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు సభాస్థలిని పరిశీలించారు. అనంతరం మంత్రులు సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. వెల్లటూరు రోడ్డులోని ఘాట్‌ రోడ్డు వద్ద బొల్లా బ్రహ్మనాయుడు అతిథిగృహం స్థలంలో సభావేదిక, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమయం తక్కువ ఉన్నా ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన సూచనలు చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో సీఎం ఏటా ఏదొక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ఆయన వినుకొండను ఎంచుకున్నారని చెప్పారు. దీనికి పెద్దఎత్తున ప్రజలు హాజరుకావాలని కోరారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని