మహిళా కూలీల ఆటో బోల్తా
మహిళా కూలీలతో వెళుతున్న ఆటో గ్రామ ఆరంభంలో ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి.
ఒకరి మృతి.. 16 మందికి గాయాలు
అద్దంకి, ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స
ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడిన కూలీలు
జాగర్లమూడివారిపాలెం(జే పంగులూరు), న్యూస్టుడే: మహిళా కూలీలతో వెళుతున్న ఆటో గ్రామ ఆరంభంలో ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు మృతిచెందగా ఏడుగురికి తీవ్రంగానూ, మిగిలిన వారు స్వల్ప గాయాలతోనూ బయటపడ్డారు. వీరిని అద్దంకి, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు. వీరంతా జే పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలేనికి చెందిన కూలీలు. మిరప కోతకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగింది. రేణింగవరం పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జాగర్లమూడివారిపాలేనికి చెందిన కూలీలు అదే గ్రామానికి చెందిన డి.సునీల్ ఆటోలో ముండ్లమూరు మండలం అగ్రహారం, తమ్మలూరు మిరప కోతలకు వెళ్లారు. కూలీ పనుల అనంతరం అదే ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. రెండు నిమిషాల్లో ఇళ్లకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఆటో వెనుక టైరు పేలింది. దీంతో అదుపు తప్పి బోల్తాపడింది. కూలీలు ఒకరిపై మరొకరు పడటంతో ఊపిరాడక గాయాలపాలయ్యారు. వాహన చోదకుడు సునీల్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం విషయమై స్పందించిన స్థానికులు గాయపడిన కూలీలకు సపర్యలు చేశారు. జాతీయ రహదారి అంబులెన్స్ వాహనంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఒంగోలు తరలించారు. ఇందులో నంబూరి రంగమ్మ మృతిచెందారు. మిగిలిన 14మంది క్షతగాత్రులను సంతమాగులూరు, కొరిశపాడు, అద్దంకి 108 వాహనాల్లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఐదుగురు క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. సంఘటనా స్థలాన్ని రేణింగవరం ఎస్సై కె.కె.తిరుపతిరావు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.
అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కూలీలు వీరే
1.జాగర్లమూడి అరుణకుమారి 2. చింతా నాగమణి 3.గంగా సీతమ్మ 4.ఎస్కె.నాగూర్బీ 5.ఎన్.శోభారాణి 6.పొన్నూరి పోలేరమ్మ 7.ధూళిపాళ్ల నాగేంద్రం 8.దేవతోటి ప్రియాంక 9.ధూళిపాళ్ల శోభారాణి, 10.ధూళిపాళ్ల అంజమ్మ 11.మల్లెల రమాదేవి 12.ఉదరగుడి శిరీష 13.జరుగుల స్వాతి 14.ధూళిపాళ్ల రత్నకుమారి 15.కల్లూరి నాగమణి 16.పొన్నూరి రామతీర్థం 17.నంబూరి రంగమ్మ(మృతి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203