logo

విధుల్లో నిర్లక్ష్యం... ఉపాధ్యాయినుల సస్పెన్షన్‌

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయినులను సస్పెండ్‌ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ ఆదేశాలిచ్చారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె శనివారం తనిఖీ చేశారు.

Published : 29 Jan 2023 06:03 IST

వెంగళాయపాలెం పాఠశాలలో తనిఖీలు చేస్తున్న డీఈవో శైలజ

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయినులను సస్పెండ్‌ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ ఆదేశాలిచ్చారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ గురించి పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వర్క్‌బుక్స్‌ను దిద్దకపోవడం గమనించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయినులు జి.పద్మావతి, షేక్‌ పర్వీన్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని