దేవాదాయ భూములకు విముక్తి
ఆక్రమణ చెర నుంచి దేవాదాయశాఖకు చెందిన ఖరీదైన భూములకు విముక్తి లభించింది. గుంటూరు రైలుపేటలో రూ.50 లక్షల విలువ చేసే దేవాదాయశాఖకు చెందిన ఆంజనేయస్వామి దేవస్థానం స్థలం 1993 నుంచి ఆక్రమణలో ఉంది.
రూ.50 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న స్థలం పత్రాలను ఆలయ ఈవో వీరాంజనేయులుకు అప్పగిస్తున్న ఏసీ మహేశ్వరరెడ్డి
నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్టుడే : ఆక్రమణ చెర నుంచి దేవాదాయశాఖకు చెందిన ఖరీదైన భూములకు విముక్తి లభించింది. గుంటూరు రైలుపేటలో రూ.50 లక్షల విలువ చేసే దేవాదాయశాఖకు చెందిన ఆంజనేయస్వామి దేవస్థానం స్థలం 1993 నుంచి ఆక్రమణలో ఉంది. ఆ స్థలంలో ఆక్రమణదారులు షిర్డీసాయిబాబా ఆలయం నిర్మించి మరికొంత స్థలంలో దుకాణాలు నిర్వహిస్తున్నారు. అధికారులు దేవాదాయశాఖ కోర్టులో కేసు గెలిచారు. ఆక్రమణదారులు జిల్లా కోర్టును ఆశ్రయించగా శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈక్రమంలో శనివారం ఆ శాఖ జిల్లా సహాయ కమిషనర్ బొంతు మహేశ్వరరెడ్డి పోలీసులు, రెవెన్యూశాఖ అధికారుల సమక్షంలో స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆంజనేయస్వామి ఆలయ ఈవో కోట వీరాంజనేయులుకు స్వాధీనం చేశారు. శాఖ ఏసీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వామి, కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు, ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?