ప్రజాసేవ సంకల్పంతోనే తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
శత జయంతి ఉత్సవాల్లో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
మాట్లాడుతున్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వేదికపై శ్రావణ్కుమార్, పెదరత్తయ్య, ప్రభాకర్
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ‘దిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం మంట కలుస్తుంటే సహించలేక.. తెలుగుజాతి ఖ్యాతిని పెంపొందించడం కోసం ఉద్భవించిందే తెదేపా. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ను మట్టి కరిపించి అధికారాన్ని కైవసం చేసుకుని పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పాలన సాగించారు. సమాజమే దేవాలయం.. పేద ప్రజలే దేవుళ్లు.. అనే నినాదంతో ప్రజా సంక్షేమ పాలనకు బాటలు వేసి దేశ రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. తలలు పండిన రాజకీయ నాయకులకు కూడా రాని ఆలోచనలు ఎన్టీఆర్కు వచ్చాయి. పేదరికం లేపి సమాజం కోసం రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి గొప్ప పథకాలను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనదే. వైకాపా ప్రభుత్వ అరాచక పాలనను తరిమికొట్టే శక్తి తెదేపా కార్యకర్తలకు ఉంది. తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి’.. అని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారన్నారు. రాజకీయంగా ఎటువంటి అనుభవం లేకపోయినా ప్రజల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలంటే ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్కు కులం, మతం లేదని, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరన్నారు. తెలుగుజాతికి, తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఈసందర్భంగా సీనియర్ నాయకుల్ని సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కంచర్ల శివరామయ్య, దామచర్ల శ్రీనివాసరావు, నూతలపాటి రామారావు, నాయుడు ఓంకార్, కాట్రగడ్డ రామకృష్ణ, ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, మల్లె విజయ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేతపై ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
[ 23-04-2024]
బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
[ 23-04-2024]
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా
[ 23-04-2024]
వైకాపాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. -
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
పదిలో పైచేయి అమ్మాయిలదే
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 88.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికల హవా స్పష్టంగా కనిపించింది. బాలికలు 90.1 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 86.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
అమ్మఒడి సాయంలో మామ కోతలు
[ 23-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా అంటూ బహిరంగసభల్లో బీరాలు పలికే జగన్ ఆ పంపిణీ మాటునే తిరిగి దోచుకుంటున్నారు. -
మురుగున పడ్డ డబ్బులెక్కడ.. మామ?
[ 23-04-2024]
భట్టిప్రోలు మండలం ఐలవరం ఉన్నతపాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. వీరికి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
సమర్థ్ యాప్తో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుశాఖ సమర్థంగా విధులు నిర్వర్తించేలా వేగవంతమైన పోలీసు సేవల కోసం కొత్తగా సమర్థ్ మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. -
ఉప్పొంగిన ప్రజాభిమానం
[ 23-04-2024]
ప్రజాభిమానం ఉప్పొంగింది. వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో జనం కసితో కదిలి కదం తొక్కారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా పసుపు, తెలుపు, కాషాయ వర్ణాలమయమైంది. ఎమ్మార్పీస్ దండు సైతం వారి జెండాలతో కదిలారు. -
అలా..చతికిలపది!
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM