ఎట్టకేలకు వైద్య కళాశాల నిర్మాణ పనులు
బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భవనాల పిల్లర్లకు గుంతలు తీసే పనులకు ఎమ్మెల్యే కోన రఘుపతి శనివారం పూజలు చేశారు.
పూజ చేసి పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి దంపతులు
బాపట్ల, న్యూస్టుడే: బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భవనాల పిల్లర్లకు గుంతలు తీసే పనులకు ఎమ్మెల్యే కోన రఘుపతి శనివారం పూజలు చేశారు. వైద్య కళాశాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన ఇరవై నెలల తర్వాత భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది డిసెంబరులోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. కళాశాలకు ప్రభుత్వం రూ.510 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2021 ఏప్రిల్లో ప్రకటించింది. పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో 56 ఎకరాల భూమిని కేటాయించారు. 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు. అయితే నిధులు విడుదల చేయకపోవటం వల్ల పనులు నత్తనడకన సాగాయి. వైద్య కళాశాలకు కేటాయించిన భూమి చెరువు కావటంతో కొంతమేర మెరక చేసి రోలింగ్ చేశారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆసుప్రతి నిర్మాణం పూర్తయి ప్రారంభిస్తేనే వైద్య కళాశాలకు కేంద్రం అనుమతి ఇస్తుంది. జిల్లా కేంద్రం బాపట్లలో సరైన వైద్య సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను 60 కి.మీ. దూరంలోని గుంటూరు తరలించాల్సి వస్తోంది. స్థానికంగా ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నా ఐసీయూ సేవలు అందుబాటులో లేవు. అత్యవసర వైద్యం అందటం లేదు. బాపట్లలో వైద్య కళాశాల, 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించటంతో వైద్య సేవలు మెరుగవుతాయని ప్రజలు భావించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు జరగక మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వైద్యల కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల, ఆసుపత్రికి 2020లో భూసేకరణ చేయగా 2021 మే 31న సీఎం జగన్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈ ఏడాది ఆఖరుకు భవనాలు పూర్తయ్యేవి. నిధుల సమస్యతో పనులు చేపట్టలేదు.
నాబార్డు నుంచి నిధులు
ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నాబార్డు నుంచి రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నాబార్డు నుంచి ఇటీవల అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో భారీ యంత్రాన్ని తెప్పించి భవనం పునాది నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల కోసం గుంతలు తీస్తున్నారు. తొలుత ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేసిన తర్వాతే వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కనీసం రెండేళ్లలో అయినా 300 పడకల ఆసుపత్రి ప్రారంభం అయితే స్థానిక ప్రజలు కోరుకుంటున్న విధంగా వైద్య సేవలు మెరుగవడానికి అవకాశం ఉంటుంది. బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వటానికి నాబార్డు అనుమతి మంజూరు చేసిందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. ఏప్రిల్లోగా భవనం మొదటి శ్లాబ్ వేస్తారు. ఇక నుంచి ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ