అదృశ్య గ్రామాల అన్వేషకుడు ... శివశంకర్
ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు గుంటూరుకు చెందిన మణిమేల శివశంకర్.
500 పల్లెల వివరాలతో పుస్తకం
ఈనాడు, అమరావతి: ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు గుంటూరుకు చెందిన మణిమేల శివశంకర్. అతను ఓ సాధారణ ముఠా కూలీ. మూటలు మోయడం అతని వృత్తి. కానీ గత చరిత్రపై అన్వేషణ చేయడం ప్రవృత్తి. చదివింది ఐదో తరగతే... అయినా శాసనాలను పరిశీలించడం, అందులోని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాలగర్భంలో కలిసిపోయిన 500 గ్రామాల చరిత్రను వెలికితీశారు. ఎలాంటి డిగ్రీలు లేకపోయినా పరిశోధకుల కంటే మిన్నగా శ్రమించి అదృశ్య గ్రామాల చరిత్రను అక్షరబద్ధం చేశారు.
ఆసక్తిని అన్వేషణగా మార్చుకుని...: ఓవైపు బస్తాలు మోస్తూ ముఠాకూలీగా పనిచేస్తూనే విరామ సమయంలో అన్వేషణ సాగించారు. ఆరంభంలో ఆలయాలు తిరిగి చరిత్ర తెలుసుకునేవారు. అక్కడి శాసనాలపై ఆరా తీసేవారు. ఈక్రమంలో ఆలయాలకు దానంగా ఇచ్చిన గ్రామాల పేర్లు చాలావరకు ప్రస్తుతం మనుగడలో లేవని గుర్తించారు. అలాంటి మరుగన పడిన అదృశ్య గ్రామాల అన్వేషణ మొదలెట్టారు. 2018 నుంచి పరిశోధిస్తూ అనేక గ్రామాలు కలియతిరిగారు. గ్రంథాలయాల్లో అనేక వివరాలు సేకరించారు. శాసనాలు, కైఫియత్తుల నుంచి వివరాలు సేకరించారు. అనేక చారిత్రక పుస్తకాలను సమకూర్చుకున్నారు. ఈక్రమంలో కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈసమయంలో తాను అన్వేషించిన గ్రామాల వివరాలు అన్నీ అక్షరబద్ధం చేశారు. అదృశ్య గ్రామాల చరిత్ర, వాటికి ఆధారాలు ఇలా వివరాలన్నీ పొందుపరిచారు. వీటిని అదృశ్య గ్రామాలు పేరుతో 2022లో పుస్తకం తీసుకువచ్చారు. ఉమ్మడి గుంటూరు పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. చిన్నతనంలో అమ్మమ్మ గారి ఊరైన బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఐదోతరగతి తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేశారు. జీవనోపాధి కోసం గుంటూరు వచ్చి ముఠా కార్మికుడిగా స్థిరపడ్డారు. దైవదర్శనం కోసం ఆలయాలకు వెళ్లే మణిశంకర్ అక్కడి స్థలపురాణం, చరిత్ర గురించి ఆరా తీసే అలవాటుగా మార్చుకున్నారు. తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. అమ్మమ్మ గారి ఊరైన భర్తిపూడిలో ఉన్నప్పుడు ఒకప్పుడు పేరుగాంచిన వెలిచర్ల, నేరేడుపల్లి, ములకపాడు గ్రామాల అదృశ్యంపై గ్రామంలోనే చర్చించుకునేవారు. చిన్నతనంలో శివశంకర్ మనసులో ఇది బలంగా నాటుకుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనే ఆలోచన చరిత్ర అన్వేషణకు పురికొల్పింది. శివశంకర్ గుంటూరు జిల్లాలోని ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు వెళ్లారు. అందుబాటులో ఉన్న రికార్డులను తిరగేశారు. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను (గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు) పేరుతో గ్రంథస్థం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామమైన పింగళి గురించి కూడా పుస్తకంలో పొందుపర్చారు. తెనాలి రామలింగకవి స్వస్థలం గార్లపాడు తెనాలి మండల గ్రామం కొలకలూరుకు సమీపంలోని అదృశ్యగ్రామమని తేల్చారు.
శివశంకర్ రాసిన పుస్తకం ఇదే
శాసనాల ఆధారంగా సేకరణ
శివశంకర్ పరిశోధనకు ప్రధాన ఆధారం శాసనాలు. పాత తెలుగు శాసనాలను చదివి అర్థం చేసుకోవడంలో పట్టు సాధించారు. సంస్కృతంలో శాసనాలు అర్థం కాకపోవడంతో తెలిసిన మిత్రుల సాయంతో అందులోని అంశాలను తెలుసుకున్నారు. పాత సాహిత్యం, కైఫియత్తులు, గెజిట్లలోని సమాచారం ఆధారంగా అదృశ్యగ్రామాల సంగతుల్ని గుర్తించారు. పుస్తకంలో అదృశ్యగ్రామాలు, విలీన గ్రామాలు, జంటగ్రామాలు, ప్రతినామ గ్రామాలు ఇలా ప్రత్యేక విభాగాలున్నాయి. పట్టణీకరణలో భాగంగా చాలా గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో కలిసిపోయాయి. అలాంటి గ్రామాల వివరాల్ని కూడా ఆయన పొందుపర్చారు. సమాచార సేకరణకు సమీకరించిన పుస్తకాలు మినీగ్రంథాలయాన్ని తలపిస్తున్నాయి.
వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం...
తన స్ఫూర్తితో చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొందరు ఔత్సాహికులు అదృశ్య గ్రామాలపై పరిశోధన చేస్తున్నట్లు శివశంకర్ తెలిపారు. కొలకలూరు శాసనాలు, వినుకొండ సీమ కరణికరపట్టిక పుస్తకాలు తీసుకు రావడానికి అధ్యయనం చేస్తున్నానన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1000 వరకు అదృశ్య గ్రామాలు ఉన్నాయని వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?