పత్తి అధారిత పరిశ్రమ కుదేలు
పత్తి పండించిన రైతులు జనవరి నెలాఖరుకు వచ్చినా అమ్మకానికి మొగ్గుచూపడం లేదు. మెరుగైన ధర కోసం వేచిచూస్తూనే ఉన్నారు. సుమారు 40 శాతం వరకు పత్తి ఇంకా రైతు గడప దాటలేదని మార్కెట్ వర్గాల అంచనా.
ఇళ్లలోనే పేరుకుపోతున్న పంట ఉత్పత్తులు
ఈనాడు, నరసరావుపేట
పత్తి పండించిన రైతులు జనవరి నెలాఖరుకు వచ్చినా అమ్మకానికి మొగ్గుచూపడం లేదు. మెరుగైన ధర కోసం వేచిచూస్తూనే ఉన్నారు. సుమారు 40 శాతం వరకు పత్తి ఇంకా రైతు గడప దాటలేదని మార్కెట్ వర్గాల అంచనా. దీంతో జిన్నింగ్, ప్రెస్సింగ్, ఆయిల్ మిల్లులకు ముడిసరకు లభ్యత తగ్గింది. ఈ పరిస్థితి జౌళి పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అందోళన అందరిలో నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్తి పండించే రైతు నుంచి వస్త్రం తయారు చేసే టెక్స్టైల్స్ పరిశ్రమ వరకు వరుసగా అన్నీ ఇబ్బందుల్లో కొనసాగుతున్నాయి.
సాధారణంగా పత్తి సీజన్ అక్టోబరుతో మొదలై జనవరి నాటికి దాదాపు 70శాతంపైగా మార్కెట్కు వస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది దిగుబడులు 3.30 కోట్ల బేళ్లు అంచనా కాగా, ఇప్పటివరకు మార్కెట్కు సుమారు 1.06 కోట్ల బేళ్లు మాత్రమే వచ్చాయి. మూడోవంతు పత్తి మాత్రమే మార్కెట్కు వచ్చింది. పత్తి రైతులు మెరుగైన ధరకు వేచిచూస్తున్నారు. నిల్వదారులు కూడా ఈ రంగంలోకి ప్రవేశించి రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్కు తరలించకుండా నిల్వచేశారు. దిగుబడులు కొంత తగ్గినా రైతులు, నిల్వదారులు వద్ద ఉన్న పత్తి పరిమాణం ఎక్కువగా ఉండటం గమనార్హం. పత్తి ధర సీజన్ ప్రారంభంలో క్వింటా రూ.10వేలకుపైగా ధర పలికింది. క్రమంగా ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటా సగటున రూ.7-8 వేల మధ్య నడుస్తోంది. ఈధరకు పత్తిని అమ్మడానికి రైతులు, నిల్వదారులు ఆసక్తి చూపడం లేదు. వేచిచూస్తే ధర పెరుగుతుందన్న భావనతో నిల్వ చేసుకుంటున్నారు.
ఎగుమతులు లేక విలవిల
భారతదేశం నుంచి చైనాకు పత్తి, దారం ఎక్కువగా ఎగుమతి అవుతుంది. చైనాలో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మిల్లులు మూతపడి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మనదేశం నుంచి పత్తి, దారం దిగుమతి చేసుకోవడం లేదు. మనదేశం నుంచి అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కేవలం 2లక్షల బేళ్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో మనదేశం ప్రత్యేక రకాలకు చెందిన పత్తి 4 లక్షల బేళ్లు దిగుమతి చేసుకుంది. లక్షల బేళ్లు ఎగుమతి కావాల్సిన సమయంలో నామమాత్రంగా కూడా ఎగుమతులు లేకపోవడం పత్తి ఆధారిత పరిశ్రమలకు శాపంగా మారింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పత్తి ధరలు తగ్గుముఖం పట్టడం ఆందోళనకర పరిణామం. దేశీయంగా దారం నిల్వలు పేరుకుపోవడంతో లభ్యత పెరిగింది. అదే సమయంలో టెక్స్టైల్స్ పరిశ్రమ తయారుచేస్తున్న వస్త్రానికి కూడా ఆశించినస్థాయిలో డిమాండ్ లేక దారం ధరలు తగ్గాయి. పత్తి ధర ఎక్కువగా ఉండటం, దారం ఎగుమతులు లేకపోవడంతో నూలు మిల్లులు పూర్తి స్థామర్థ్యంతో పనిచేయకుండా మూడు విడతల స్థానంలో ఒక విడత పనిచేస్తూ ఉత్పత్తి తగ్గించుకున్నాయి. కొన్ని మిల్లులు పూర్తిగా కొన్నాళ్లపాటు మూసేశారు. దేశీయంగా నూలు పరిశ్రమలు నెలకు 25వేల నుంచి 30లక్షల బేళ్ల వరకు దూది అవసరం. మిల్లులు పూర్తిస్థాయిలో పని చేయనందున వినియోగం తగ్గింది. మరోవైపు జిన్నింగ్ మిల్లుల యజమానులు క్యాండీ దూది ధర రూ.72వేలు ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా పత్తి కొనుగోలు చేసి బేళ్లు తయారు చేసి నిల్వలు పెట్టుకున్నారు.
అనూహ్యంగా క్యాండీ ధర రూ.62 వేలకు పతనం కావడంతో జిన్నింగ్ పరిశ్రమ కుదేలయింది. క్యాండీకి రూ.10వేల వరకు జిన్నర్లు నష్టాలు చవిచూశారు. దీంతో జిన్నర్లు పత్తి ధర తగ్గించడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపడం లేదు. పత్తి నుంచి వస్త్రం వరకు అన్నింటికి డిమాండ్ పడిపోవడంతో ఎక్కడికక్కడ పత్తి ఆధారిత పరిశ్రమల్లో స్తబ్దత నెలకొంది. రైతు నుంచి వస్త్రం తయారీదారు వరకు అందరూ ఎన్నడూ లేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎగుమతులు పుంజుకోకపోతే పత్తి ధరలు పెరిగే అవకాశం లేదని నూలు మిల్లు యజమాని ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ