ఆక్వా రంగానికి ఊరట
జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. రొయ్యల మేతలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్లో రొయ్యల ధరలు పతనమై సాగుదారులు సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
రొయ్యల మేత ముడి పదార్థాల దిగుమతిపై పన్ను తగ్గింపు
పరిశ్రమ నిర్వాహకులు ధర తగ్గిస్తేనే రొయ్య రైతుకు మేలు
జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. రొయ్యల మేతలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్లో రొయ్యల ధరలు పతనమై సాగుదారులు సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. రొయ్యల మేత తయారీకి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని పది నుంచి పదిహేను శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. ఈ మేరకు రొయ్యల మేత ధరలు కంపెనీలు తగ్గిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది.
బాపట్ల, న్యూస్టుడే: జిల్లా నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో అక్వా, గ్రానైట్ రంగాలదే సింహభాగం. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల చెరువులపై సరఫరా చేస్తున్న కరెంటుపై రాయితీ తగ్గించటం వల్ల సాగుదారులపై ఛార్జీల భారం మూడు రెట్లు పెరిగింది. రొయ్యల సాగులో 70 శాతం ఖర్చు మేతకే అవుతుంది. రెండేళ్లలో 25 కేజీల బస్తా ధర రూ.400కు పైగా పెరిగింది. 2021 మార్చిలో రూ.1730గా ఉన్న ధర ప్రస్తుతం రూ.2160కు చేరుకుంది. సాగులో వినియోగించే మందుల ధరలు 30 శాతం పెరిగాయి. టన్ను మేత రూ.10 వేలు పెంచటం వల్ల మూడు నెలలు సాగు చేసే వనామీ రకం రొయ్యలకు ఎకరాకు రూ.30 వేలకు పైగా భారం సాగుదారులపై పడింది. విదేశాలకు ఎగుమతులు తగ్గటం, కంపెనీలు కలిసి కోత వేయటం వల్ల మార్కెట్లో రొయ్యల ధర 40 శాతం పడిపోయింది. వంద కౌంట్ రూ.170కు పడిపోయింది. ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి లేకపోవడంతో ధరను రూ.240కు తాత్కాలికంగా పెంచారు. వంద కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రైతుకు రూ.280 వరకు ఖర్చు అవుతోంది. కనీసం రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. మూడు నెలలుగా ధరలు పతనమై ఆక్వా సాగుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు చేయడానికి జంకుతున్నారు. ఈ ఏడాది రొయ్యల ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. రొయ్యల మేత తయారీకి వినియోగించే ముడి పదార్థాలను విదేశాల నుంచి కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. బడ్జెట్లో కేంద్రం వీటిపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 15 శాతానికి తగ్గించింది. రొయ్యల మేత ధరలు సైతం ఇదే రీతిలో తగ్గడానికి అవకాశం ఏర్పడింది. అదే జరిగితే రైతులు, హేచరీల యజమానులకు కొంత మేర లబ్ధి కలుగుతుంది. కేంద్ర ఇచ్చిన రాయితీ తమకు మేలు చేసేలా మేత ధరలు తగ్గించాలని రొయ్య రైతులు కోరుతున్నారు.
వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో కదలిక
బాపట్లలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ప్రకటించింది. ఐదు వందల పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల కోసం పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో 53 ఎకరాల భూమి కేటాయించారు. రూ.510 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. 20 నెలల క్రితమే వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణానికి వర్చువల్గా సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. రెండు కళాశాలల ఏర్పాటునకు ఇన్నాళ్లూ కేంద్రం నుంచి అనుమతి లేదు. నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవలే భవనాలకు స్తంభాలు నిర్మించే పనులు ప్రారంభించారు. తాజాగా కేంద్ర బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల ఏర్పాటునకు పచ్చజెండా ఊపారు. కేంద్రం అనుమతి లభిస్తే రెండు కళాశాలల నిర్మాణానికి నిధులు విడుదలవుతాయి. భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యి ఆసుపత్రి, కళాశాలలు రెండేళ్లలో ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. ఐదొందల పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ప్రారంభమైతే జిల్లావాసులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
సాగుకు చేదోడు
రైతులకు రసాయన ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగి గిట్టుబాటు కాకపోవడంతో వాటి వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం బడ్జెట్లో పీఎం-ప్రణామ్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో భాగంగా కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రకృతి సాగు చేపట్టేవారికి ఇది ప్రయోజకరం. బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్ల ఏర్పాటు వల్ల ప్రకృతి సాగుకు ఉత్పాదకాల లభ్యత పెరిగి సేంద్రీయసాగు పుంజుకోనుంది. సాగు పద్ధతులను ఆధునికీకరించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి స్టార్టప్లకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు. దీంతో సాగు కొత్తపుంతలు తొక్కనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 48వేల మంది రైతులు ప్రకృతి సాగులో ఉన్నారు. నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి ప్రభుత్వం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు. మూడు జిల్లాల పరిధిలో 2లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతున్నందున రైతులకు ప్రయోజనకరం. మూడు జిల్లాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 164 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటిని కంప్యూటరైజ్డ్ చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. దీంతో పీఏసీఎస్ల్లోనూ డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన ద్వారా బాపట్ల జిల్లాలో తీరప్రాంతంలో ఉన్న వేలమంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. మత్స్యరంగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం వల్ల హేచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం లభించనుంది. ఇవి పెరిగితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
* జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం: 22 వేల ఎకరాలు
* రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలు: 17
* ప్రాసెసింగ్ ప్లాంట్లు: 7
* ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ: రూ.2000 కోట్లు
* ఏటా ఉత్పత్తి అవుతున్న రొయ్యలు: 80 వేల టన్నులు
* విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్యల విలువ: రూ.1500 కోట్లు
ప్రయోజనం రైతులకు అందేలా చూడాలి
రొయ్యల మేత ధరలు గత రెండేళ్లలో విపరీతంగా పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడిపదార్థాల ధరలు పెరిగాయని కంపెనీలు మేత ధర పెంచుతున్నాయి. కేంద్రం బడ్జెట్లో మేత తయారీకి వాడే ముడిపదార్థాలపై పన్ను తగ్గించింది. ఆ మేరకు తయారీ ఖర్చు తగ్గుతుంది. కేంద్రం బడ్జెట్లో కల్పించిన లబ్ధి కేవలం కంపెనీలకే కాకుండా రైతుల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలి.
శరత్, ఆక్వా రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్