నిందితుల అరెస్టు కోరుతూ ఆందోళన
మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో అరవింద వారధికి సమీపంలోని ఇసుక మేటల్లో వారం రోజులుగా చింతల్లంకకు చెందిన దళితులు చేపట్టిన చెట్లు, తుప్పల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.
కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన చింతల్లంక దళితులు
కొల్లూరు, న్యూస్టుడే: మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో అరవింద వారధికి సమీపంలోని ఇసుక మేటల్లో వారం రోజులుగా చింతల్లంకకు చెందిన దళితులు చేపట్టిన చెట్లు, తుప్పల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు దళితులకు స్వల్ప గాయాలయ్యాయి. తమపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ బుధవారం చింతల్లంకకు చెందిన దళితులు కొల్లూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సుమారు గంట సేపు గడిచినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో టెంట్, వంట పాత్రలు అక్కడకు చేర్చి తమ డిమాండ్లు నెరవేరే వరకూ కదిలేది లేదంటూ భీష్మించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని నినాదాలు చేస్తుండగా తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు చుండూరు సీఐ కల్యాణరాజు అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని డీఎస్పీ విచారించాల్సి ఉందని, ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు. తహసీల్దార్తో చర్చల అనంతరం సీఐ వారితో మాట్లాడారు. సీఐ బాధితులకు పూర్తి భద్రత కల్పించేందుకు పోలీసు పికెట్ల సంఖ్య పెంచుతామని, భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ దళితులు కోరుకుంటున్న భూములను నదీపరిరక్షణ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పరిశీలించి చట్ట ప్రకారం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య ఆందోళన కారులనుద్దేశించి మాట్లాడుతూ ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. దీంతో బైఠాయింపు ముగిసింది. ఈ ఆందోళనకు వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తురుమెళ్ల కృష్ణమోహన్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్, రైతు సంఘం నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, ప్రజాసంఘాల నాయకులు బొనిగల సుబ్బారావు, శరత్, సుధాకర్, స్థానికులు ఇస్సాకు, లాజరు, చంటి నేతృత్వం వహించారు. ఎస్సై శామ్యూల్ రాజీవ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.
అట్రాసిటీ కేసు నమోదు
కృష్ణానదిలో నదీపరిరక్షణ శాఖకు చెందిన భూములను సాగుకు అనుకూలంగా బాగు చేసుకునేందుకు వెళుతుండగా పెదలంకకు చెందిన ఉప్పు కృష్ణారావు, తోట సాంబశివరావుతో పాటు మరి కొంత మంది దాడి చేసి తోడేటి రవి, తోడేటి రాజేష్తో పాటు తననూ గాయపరిచారని చింతల్లంకకు చెందిన గుంటూరు ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శామ్యూల్ రాజీవ్ కుమార్ తెలిపారు. అడ్డగించిన వారిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా అకారణంగా తమను కొట్టారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
దాడిలో గాయపడి, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తోడేటి రాజేష్, తోడేటి రవి, గుంటూరు ఏసోబు నివాసాలకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర నాయకురాలు ధూళిపాళ్ల రమాదేవి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్