ప్రాణాలు పోతున్నా.. పాఠాలు నేర్వరా
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదంలో దర్శిత్ అనే బాలుడు మృతి చెందగా, నకరికల్లు మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల గౌతమ్ విద్యుత్తు నియంత్రికను తాకి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
నకరికల్లులో గౌతమ్ని బలిగొన్న విద్యుత్తు నియంత్రిక ఇదే..
నకరికల్లు, న్యూస్టుడే: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదంలో దర్శిత్ అనే బాలుడు మృతి చెందగా, నకరికల్లు మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల గౌతమ్ విద్యుత్తు నియంత్రికను తాకి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. కరెంటు తీగలు చిన్నారులను బలి తీసుకుంటున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల బాలుడు ఎంత ఎత్తు ఉంటాడు.. ఆ బాలుడినే తాకేంత ఎత్తులో తీగలు ఉన్నాయంటే ప్రమాదమే కదా.. నకరికల్లులో ఎన్నెస్పీ కాలనీలో ప్రాథమిక పాఠశాలకు అనుకునే ఉన్న విద్యుత్తు నియంత్రిక గౌతమ్ పాలిట యమపాశమైంది. సదరు నియంత్రికను తొలగించాలని ఏళ్ల తరపడి విన్నవించినా పట్టించుకోలేదు. అప్పుడే స్పందించి ఉంటే చిన్నారి గౌతమ్ దూరమయ్యేవాడు కాదు.. బిడ్డతో పాటు తమ జీవితాలూ తలకిందులయ్యాయని ఆ దంపతులు రోదిస్తున్న తీరు హృదయాన్ని ద్రవింపజేస్తోంది. విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పొయిన గౌతమ్ 13 రోజులు పాటు మృత్యువుతో పోరాడినా ప్రాణం దక్కలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. పాఠశాలలో విద్యుత్తు నియంత్రిక తక్కువ ఎత్తులో ఉండటంతో పాటు నేలను తాకుతూ ఫ్యూజ్ బాక్సులు ఉన్నాయి. తాజాగా నియంత్రిక ఒక పక్కకు వరిగిపోయి ఉంది. ప్రాణాలు పోతున్నా గుణపాఠం నేర్వడం లేదని, విద్యుత్తు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నియంత్రికను తొలగించాలని స్థానికులు, ఉపాధ్యాయుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గౌతమ్ మృతి చెందాడంటూ నకరికల్లు రాష్ట్రీయ రహదారిపై భౌతికకాయంతో ధర్నా చేపట్టిన విషయం విదితమే. తాజాగా నియంత్రిక పక్క నుంచే పాఠశాలకు రోజూ వెళ్లి వచ్చే క్రమంలో పిల్లలు భయంభయంగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరో ప్రమాదం తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆసుపత్రిలో గౌతమ్(పాత చిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్