తొలగని భయం
సత్తెనపల్లి మండల పరిధి రామకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో బుధవారం తరగతులు జరగలేదు. సోమవారం 206 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవగా, గురుకులంలో మిగిలిన విద్యార్థినుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
గురుకులంలో తెరచుకోని తరగతి గదులు
బాలికలను తీసుకురాని తల్లిదండ్రులు
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్టుడే : సత్తెనపల్లి మండల పరిధి రామకృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో బుధవారం తరగతులు జరగలేదు. సోమవారం 206 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవగా, గురుకులంలో మిగిలిన విద్యార్థినుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అదే రోజు రాత్రి వారి పిల్లలను ఇంటికి తీసుకుపోయారు. ఈ పరిణామాలతో మంగళవారం గురుకులానికి జిల్లా కలెక్టరు ప్రత్యేక సెలవు ప్రకటించారు. బుధవారం తరగతులకు బాలికలు హాజరు కావాలని సూచించారు. అయితే విద్యార్థినులు గురుకులానికి బుధవారం చేరుకోలేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బాలికలను గురుకులానికి పంపాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో బుధవారం గురుకులంలో తరగతి, వసతి గదులు వెలవెలబోయాయి. ఇదిలా ఉండగా అధికారుల సూచనల మేరకు ఆవరణలో పారిశుద్ధ్య చర్యలు మొదలయ్యాయి. పనికిరాని మొక్కలు, ముళ్లకంప తొలగింపు చర్యలను చేపట్టారు. మురుగునీటి పారుదల పనులు జరుగుతున్నాయి. భోజనశాలలోని తాగు నీటి శుద్ధి యంత్రం మరమ్మతులకు నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయినులు సొంత నగదుతో మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు.
కొనసాగుతున్న వైద్య సేవలు
బాలికల్లో 32 మంది మూడ్రోజులుగా వైద్య చికిత్స పొందుతున్నారు. గుంటూరులోని సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఏడుగురు బాలికల్లో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో 25 మంది సత్తెనపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్రావు తెలిపారు. వారిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం ఉందన్నారు. వాంతులు, విరేచనాల వల్ల నీరసించిన కొందరిలో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వేగంగా కోలుకోలేకపోతున్నారని అన్నారు. అందరి ఆరోగ్యాన్ని పిల్లల వైద్యులు, సాధారణ వైద్యులు 24 గంటలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. గురువారం సాయంత్రానికి అందరినీ డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
సిలబస్ పూర్తిపై దృష్టి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి సంజీవరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త శాంతి విశాల గురుకులాన్ని సందర్శించారు. ప్రిన్సిపల్ స్వర్ణకుమారి, ఉపాధ్యాయ బృందంతో సమావేశం నిర్వహించారు. బాలికలు ఇళ్లకు వెళ్లిన నేపథ్యంలో తరగతులు జరగడం లేదని, సిలబస్ పూర్తికి ఆటంకం ఏర్పడుతోందని గుర్తించారు. తిరిగి తరగతులు పున:ప్రారంభం కాగానే ప్రత్యేక చొరవతో సిలబస్ పూర్తిపై దృష్టి సారించాలని సూచించారు.
బాలికలకు పరామర్శ
సత్తెనపల్లి, న్యూస్టుడే : స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలికలను బుధవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని విద్యార్థినులను ఆరా తీశారు. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఇంటికి వెళ్లాలని అప్పటివరకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందుకోవాలని వారికి సూచించారు. ఏపీవీపీ డీసీ డాక్టర్ బీవీ రంగారావు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవల్ని పర్యవేక్షించారు. విద్యార్థినులందరూ పూర్తిగా కోలుకున్నారని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
[ 20-04-2024]
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. -
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?