సౌరవిద్యుత్తుకు ని‘బంధనాలు’!
సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుని విద్యుత్తు తయారీకి కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నా విద్యుత్తు సంస్థల నుంచి తగినంత సహకారం అందడం లేదు.
కేంద్ర రాయితీని ఉపయోగించుకోలేని వైనం
ఇళ్లపై అమర్చిన సౌరఫలకలు
ఈనాడు-అమరావతి: సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుని విద్యుత్తు తయారీకి కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నా విద్యుత్తు సంస్థల నుంచి తగినంత సహకారం అందడం లేదు. గృహాలపై సౌరపలకలు అమర్చుకుని విద్యుత్తు ఉత్పత్తికి పలువురు ఆసక్తి చూపుతున్నా దరఖాస్తు నుంచి నెట్మీటర్ల ఏర్పాటు వరకు ప్రతిదశలోనూ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఇటీవల సౌరవిద్యుత్తు విధానంలో విద్యుత్తుశాఖ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో గృహాలపై సౌరపలకాలు ఏర్పాటుచేసుకోవడానికి పలువురికి ఆసక్తి ఉన్నా మారిన మార్గదర్శకాలతో వారు ముందుకు రావడం లేదు.
పర్యావరణ హితం... సొమ్ము ఆదా: గృహాల పైకప్పులపై సౌరపలకలు ఏర్పాటుచేసుకోవడం ద్వారా రోజువారీగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇది పర్యావరణ హితం కావడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం 20 నుంచి 40శాతం వరకు రాయితీ అందిస్తోంది. రోజురోజుకు విద్యుత్తు ఛార్జీల భారం అధికమవుతుండడంతో పలువురు ఇళ్ల పైభాగంలో సౌరఫలకలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా వచ్చే విద్యుత్తును తమ అవసరాలకు వాడుకుని, మిగిలింది గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఎంత విద్యుత్తును బయటకు పంపుతున్నారో, ఆమేరకు యూనిట్కు నిర్దేశించిన మొత్తాన్ని డిస్కమ్ చెల్లిస్తుంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు తొలుత వ్యయం ఎక్కువ అవుతున్నా.. విద్యుత్తు బిల్లులో నెలవారీగా తగ్గుదల, విద్యుత్తు మిగిలితే రాబడి వస్తుండడంతో నిర్వహణ వ్యయం తగ్గుతోంది. ఒకసారి అమర్చుకుంటే 25ఏళ్లపాటు ప్రయోజనం పొందే వెసులుబాటు ఉన్నందున ధీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు.
నిబంధనల మార్పుతో భారీ తేడా
సౌరఫలకలు ఏర్పాటుచేసుకుని విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేవారికి ఇప్పటివరకు ఒక విధానం అమలుచేశారు. వినియోగించిన విద్యుత్తు, ఉత్పత్తి అయిన సౌరవిద్యుత్తు యూనిట్లు పరిగణనలోకి తీసుకుని ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువ ఉంటే ఆ తేడాకు బిల్లు వసూలుచేసేవారు. ఉత్పత్తికి, వినియోగానికి ఉన్న యూనిట్ల సంఖ్య ఆధారంగా ఆయా స్లాబు మేరకు సొమ్ము వసూలుచేసేవారు. తాజాగా మారిన మార్గదర్శకాల ప్రకారం నెలవారీగా వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఏస్లాబు పరిధిలోకి వస్తే ఆస్లాబు యూనిట్ ధర ఆధారంగా సొమ్ము నిర్ణయిస్తారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తి ఆయిన యూనిట్లకు యూనిట్కు రూ.3.70లు చొప్పున లెక్కించి ఆమొత్తాన్ని బిల్లులో తగ్గించి మిగిలిన సొమ్ము వసూలుచేస్తారు.
అడుగడుగునా ఆటంకాలే...
ఇళ్లపై సౌరఫలకలు ఏర్పాటుచేసుకుని విద్యుత్తు తయారీకి ఆన్లైన్లో విద్యుత్తుశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలన్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దరఖాస్తులు పూర్తిచేసి అప్లోడ్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి సౌరపలకలు ఏర్పాటుచేసుకున్న తర్వాత ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు, గ్రిడ్కు ఎంత మేర వెళ్తోంది అన్నది నెట్ మీటరు ద్వారా తెలుస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకుంటే విద్యుత్తు శాఖ అందజేస్తుంది. ప్రస్తుతం విద్యుత్తుశాఖ వద్ద మీటర్లు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుక్కోమని అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో మీటరు కొనుగోలు చేయాలంటే విద్యుత్తు అధికారుల అనుమతి అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా