అంతర్ జిల్లాల దొంగ అరెస్టు
డిగ్రీ చదివి మద్యానికి బానిసై దొంగగా మారిన అంతర్ జిల్లాల నేరస్థుడిని కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు.
13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు తెలుపుతున్న డీఎస్పీ సీతారామయ్య, చిత్రంలో సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు మీరజ్, శ్రీనివాసరావు, మధుపవన్
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే : డిగ్రీ చదివి మద్యానికి బానిసై దొంగగా మారిన అంతర్ జిల్లాల నేరస్థుడిని కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పోలీసుస్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ శ్రీనివాసులురెడ్డితో కలిసి తూర్పు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సర్వేపల్లి అంకమ్మరావు డిగ్రీ చదువుకున్నాడు. కారు డ్రైవర్గా పనిచేశాడు. కుటుంబ సభ్యులతో స్పర్థలు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ద్విచక్ర వాహనాలు చోరీ చేసి, వాటిని అమ్ముకొని జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. గత మూడేళ్లుగా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరులో 20 వాహనాలు తస్కరించిన కేసుల్లో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద రోగులకు పెడుతున్న ఉచిత భోజనం తింటూ రోడ్లపై జీవిస్తున్నాడు. రోడ్లపై పారేసిన అరిగిపోయిన తాళాలు తీసుకొని వాటితో రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరించేవాడు. పది రోజుల్లో 13 వాహనాలు చోరీ చేశాడు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో తూర్పు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మీరజ్ నిందితుడిపై నిఘా పెట్టారు. సీఐ, ఎస్సైలతోపాటు ఏఎస్సై ఆంథోనీ, సిబ్బంది దాసు, సురేష్లు బుధవారం మాయబజార్లో గాలింపు చేపట్టారు. ఓ వాహనాన్ని తస్కరించి విక్రయించడానికి తీసుకు వెళుతున్న క్రమంలో అంకమ్మరావును అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద రూ.9 లక్షలు విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
స్వాధీనం చేసుకున్న వాహనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!