ఏళ్లుగా సాగతీత
తెనాలి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నుంచి ఆటో నగర్ వరకు 2.3 కిలో మీటర్ల పరిధిలో రోడ్డు విస్తరణ, రెండు వైపులా కాలువల అంచుల వెంబడి గోడలు..
తెనాలి నాలుగు వరుసల రోడ్డు పనుల తీరు
కాలువ అంచుల వెంట సగంలో ఆగిన గోడ నిర్మాణం
తెనాలి టౌన్, న్యూస్టుడే: తెనాలి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నుంచి ఆటో నగర్ వరకు 2.3 కిలో మీటర్ల పరిధిలో రోడ్డు విస్తరణ, రెండు వైపులా కాలువల అంచుల వెంబడి గోడలు, కాలి నడక వంతెనలు, విభజన గోడలు వెరసి రెండు విభాగాలుగా రూ.36 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు 2018లో మొదలై నేటికీ పూర్తి కాలేదు. తెనాలి నుంచి మంగళగిరి మీదుగా విజయవాడ వైపు వెళ్లటానికి, ఇటు నందివెలుగు మీదుగా గుంటూరు చేరడానికి ఇదే ప్రధాన మార్గం. పారిశ్రామిక వాడ నుంచి ఉత్పత్తుల రవాణాతో పాటు జనం రాకపోకలకు ఈ మార్గమే కీలకం. సంవత్సరాలుగా పనులు కొనసాగుతూ ఉండడంతో రోడ్డు సరైన విధంగా లేక అనేక ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాపాయాలు కూడా సంభవించాయి. రోడ్ల మీద ఉన్న భారీ గుంతలను అధిగమించడానికి వాహనాలు ఒక్కసారిగా పక్కకు వస్తూ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పనులు ఆలస్యం కావడంతో విస్తరణ ప్రాంతాల్లో గడ్డి మొలచి వాటి కోసం పశువులు చేరుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న కాలి నడక వంతెనలపై పిచ్చిచెట్లు పైకి రాగా, ఇప్పటి వరకు పనులు జరిగిన వంతెనపై నుంచి టైల్స్ అప్పడే కిందకు జారుతున్నాయి. వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్రజల వెతలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.
రోడ్డు విస్తరణ చేయాల్సిన ప్రాంతంలో గడ్డి తింటున్న పశువులు
త్వరలో పూర్తి చేయిస్తాం
- నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ, డీఈ
రోడ్డు పనులు కొంత ఆలస్యం అయిన విషయం వాస్తవమే. త్వరలోనే పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ విషయంపై గుత్తేదారులతో మాట్లాడాం. రూ.36 కోట్ల పనుల్లో ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల పనులు జరిగాయి. మిగిలినవి కూడా అతి త్వరలో పూర్తి చేయిస్తాం. ఫుట్పాత్లపై నుంచి టైల్స్ జారిపోయిన ప్రాంతాల్లో వాటిని సరి చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న సమర్పించు.. గోతుల రాజ్యం!
[ 23-04-2024]
జగనన్న పాపాలు ఎన్నని చెప్పేది.. ఎందెందు వెతికినా.. అన్నింటా లోపాలే.. అన్నిచోట్లా అసమర్థ పాలనే! రోడ్లను చూడండి... రాళ్లు తేలి.. గుంతలు పడి... బీటలువారి.. కనీసం ద్విచక్ర వాహనమైనా ముందుకు కదల్లేని దుస్థితి. -
జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పని భారం పెంచేశారు.. పోస్టులు భర్తీ చేయరు..
[ 23-04-2024]
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం: ఇక్కడ ఐదు పోస్టులే ఉన్నాయి. అందులో ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. -
రూ.46 కోట్లు నష్టపోయాం
[ 23-04-2024]
గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసుల నమోదు ప్రక్రియలో సరైన కోణంలో పని చేయనందున ఆసుపత్రికి రావాల్సిన సుమారు రూ.46 కోట్లు ఆర్థికంగా నష్టపోయామని సూపరిôటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. -
వసతి గృహ విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు
[ 23-04-2024]
జిల్లాలోని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉండి పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి 93 మంది పరీక్షలకు హాజరు కాగా 76 మంది ఉత్తీర్ణులయ్యారు. -
స్పందించేందుకు ఇప్పుడు సమయం దొరికిందా..?
[ 23-04-2024]
రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసంపై సీఆర్డీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. -
ప్రత్తిపాడును అగ్రగామిగా నిలుపుతా: బూర్ల
[ 23-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతానని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి డాక్టరు బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది. -
మేలు సంగతి తర్వాత.. ముందు నీళ్లివ్వండి
[ 23-04-2024]
‘మేం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. సకల సౌకర్యాలు కల్పించి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ ఇవీ వైకాపా నేతలు సమయం చిక్కినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు.‘ -
పదిలో పెరిగిన ఉత్తీర్ణత
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో పల్నాడు జిల్లా విద్యార్థులు నిరుటి కంటే 16 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24959 మందికి గాను 21477 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. -
వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా
[ 23-04-2024]
‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.