‘సంకల్పసిద్ధి’ కీలక ఏజెంట్ల ఖాతాలపై నిఘా..!
సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాలలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్లపై పోలీసులు దృష్టి సారించారు. వారి ఖాతాలను సీజ్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ఇప్పటి వరకు రూ.45కోట్ల ఆస్తుల స్వాధీనం
ఈనాడు, అమరావతి: సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాలలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్లపై పోలీసులు దృష్టి సారించారు. వారి ఖాతాలను సీజ్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్సు, సీసీఎస్ పోలీసులతో కీలక సమాచారం రాబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారి గుత్తా వేణుగోపాల్తో పాటు గుత్తా కిషోర్, గంజాల లక్ష్మి, మావూరి వెంకట నాగలక్ష్మితో పాటు మొత్తం 9మందిని గత ఏడాది నవంబరు 28న అరెస్టు చేశారు. దశల వారీగా ఇప్పటి వరకు మొత్తం 25మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నవంబరు నాటికి రూ.51.60లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏజెంట్లు చెల్లించే సొమ్ములకు ప్రత్యేక ఖాతా తెరిచి దీనికి సొంతగా ఒక యాప్ను రూపొందించుకున్నారు. దీని ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. ఇలా చెల్లించిన సొమ్ము ప్రత్యేక ఖాతాలోకి వెళ్తుంది. వారి సొమ్ము అభివృద్ధి అయినట్లు యాప్లో కనిపిస్తుంది. కానీ తిరిగి పొందేందుకు వెనక్కి రాదు. ఈ యాప్ ద్వారా చెల్లింపు, ఎక్కడెక్కడి నుంచి లావాదేవీలు జరిగాయనే విషయాలను సీసీఎస్, సైబర్ క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు.
సంకల్పసిద్ధి కేసు నమోదు చేసిన నుంచి ఇప్పటి వరకు రూ.45 కోట్ల ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కనిగిరి వద్ద నివేశన స్థలాలూ ఇందులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎక్కువగా కోర్ ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరులోనూ వసూలు చేసినా ఫిర్యాదులు అందలేదు. మొదట చేరిన వారు దాదాపు లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో ఈ మోసాలు వెలుగు చూశాయి. వసూలు చేసిన సొమ్ము ఎంత ఉంటుందనేది యాప్ వివరాలను బట్టి పోల్చాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ