రూ.కోట్ల పనులకు బాక్సు టెండర్లు!
గుంటూరు నగరపాలకలో కొందరు విభాగాధిపతులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి మాయాజాలంలో పడి పెట్టకూడని దస్త్రాలపైనా సంతకాలు పెట్టేసి చివరకు న్యాయస్థానాల ముంగిట నిలబడాల్సిన పరిస్థితి గతంలోనూ కొందరు కమిషనర్లకు ఎదురైంది.
నగరపాలక సంస్థలో విచిత్రం
ఇంజినీరింగ్ విభాగం తీరుపై విమర్శలు
ఈనాడు, అమరావతి: గుంటూరు నగరపాలకలో కొందరు విభాగాధిపతులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి మాయాజాలంలో పడి పెట్టకూడని దస్త్రాలపైనా సంతకాలు పెట్టేసి చివరకు న్యాయస్థానాల ముంగిట నిలబడాల్సిన పరిస్థితి గతంలోనూ కొందరు కమిషనర్లకు ఎదురైంది. తాజాగా ఎత్తురోడ్లో ఓ అపార్టుమెంట్ వద్ద డ్రైనేజీ నిర్మాణం విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ప్రణాళికాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ గోడను, డ్రైనేజీ కాల్వను ధ్వంసం చేయడంతో సంబంధిత స్థల యజమాని అధికారుల తీరుపై కోర్టుకెక్కారు. ఆ కేసులో నగరపాలక ఉన్నతాధికారిని నేరుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క ప్రణాళిక విభాగంలోనే కాదు ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగంలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని తప్పులకు చివరికి ఉన్నతాధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.కోట్ల విలువైన పనులకు..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమృత్-2 కింద చేపట్టాల్సిన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా గుంటూరు నగరపాలకలో తాగునీటి సరఫరా, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పనులకు ప్రణాళికలు రూపొందించే యోచనలో ఇంజినీరింగ్ వర్గాలు ఉన్నాయి. వీటి తయారీ బాధ్యతలను కన్సల్టెన్సీ కంపెనీలకు అప్పగించడానికి ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఉత్సాహం చూపిస్తుంటే.. అదే విభాగానికి చెందిన కొందరు అధికారులు మార్గదర్శకాలకు విరుద్ధంగా పనులు ప్రతిపాదించి వాటిపై సంతకాలు కోరితే పెట్టలేమని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఇటీవల ఇంజినీరింగ్ విభాగం ఆ పనుల రూపకల్పనకు తొలుత డిజైన్లు, పని అంచనాల తయారీకి టెండర్లు పిలిచింది. ఈ పనులను ప్రైవేటు కన్సల్టెన్సీలు నిర్వహిస్తాయి. మొత్తం పని అంచనా విలువపై ఒక శాతం ఫీజు వాటికి చెల్లించాలి. అమృత్-2 కింద నగరానికి తొలి దశలో రూ.20-30 కోట్లు వస్తాయని ముందుగానే అధికారులు భావించి ఆ పనుల నిర్వహణకు అవసరమైన డీపీఆర్ల తయారీ కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ బాక్సు టెండర్లో బిడ్లు పిలిచారు. అయితే ఈ పనులన్నింటికి కన్సల్టెన్సీ ఛార్జీల చెల్లింపులు కోట్లలోనే ఉంటాయని, అలాంటి పనులకు ఆన్లైన్, ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలవాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా బాక్సు టెండర్లు పిలుస్తున్నారని కొందరు గుత్తేదారులు తాజాగా న్యాయస్థానానికి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఇంజినీరింగ్ విభాగంలో గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఈ విషయం తెలుసుకుని ఓ ఉన్నతాధికారి తాను బాక్సు టెండర్ దస్త్రంపై సంతకం చేయలేనని చెప్పినా పెట్టాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలిసింది. ఒక్క డీపీఆర్ తయారీకి మాత్రమే కాదు కొన్ని పనులకు అధికార కార్పొరేటర్ల ఒత్తిళ్లకు తలొగ్గి టెండర్లు పిలవకుండా నామినేషన్లపై చేయిస్తున్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రూ.50లక్షల పని ఐదు విభాగాలుగా విభజించి టెండర్లుకు వెళ్లకుండా అస్మదీయ గుత్తేదారులకు కట్టబెట్టి ఆ మేరకు వారి నుంచి కమీషన్లు తీసుకునే పనిలో కొందరు అధికారులు ఉన్నారని తెలిసింది. ఈ తప్పిదాలన్నింటిపై కోర్టులో కేసులు పడతాయి. వాటికి చివరకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆ విషయం గుర్తెరిగి టెండర్లలో జరుగుతున్న మోసాలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM