రైతుకు గండెకోత
కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.
కృష్ణా కరకట్ట గండి పూడ్చేదెప్పుడూ?
నదిలో కలిసిపోతున్న పంట భూములు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, కొల్లూరు
అరవింద వారధికి ఎగువన నది వెంబడి పడిన గండి విస్తరించిన దృశ్యం
కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. కట్ట బలహీనపడి ఏటా కొంతభూమి కోతకు గురై నదిలో కలిసిపోతోంది. రూ.కోట్ల విలువైన భూములు కోల్పోతున్న కర్షకులు నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్నారు. కట్ట బలోపేతం చేసి భూములు కోతకు గురికాకుండా చూడాలని సాగుదారులు చేస్తున్న వినతులు బుట్టదాఖలవుతున్నాయి. ఇదీ బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఆరవింద వారధి ఎగువ భాగంలో నది వెంబడి ఉన్న భూములు ఉన్న రైతుల దుస్థితి.
కొల్లూరు మండలంలో కృష్ణానది పాయ నుంచి లంక గ్రామాలను అనుసంధానం చేసే అరవింద వారధి ఎగువభాగంలో నాణ్యమైన మట్టి లభిస్తోంది. అరవింద వారధికి ఎగువన సహజ సిద్ధంగా కట్టకు ఏర్పడిన గండి ద్వారా నది నుంచి నీరు ఒక పాయగా చీలి పెసర్లంక, ఆవులవారిపాలెం గ్రామాల మీదుగా పోతార్లంక శివారులో గాజుల్లంక వద్ద కృష్ణానది నుంచి చీలిన చినరేవులో కలుస్తుంది. మరోవైపు లంక భూముల నుంచి వర్షపు నీరు ఈ గండి నుంచి కృష్ణానదిలోకి వెళ్లడానికి వీలుగా గండి ఏర్పడింది. దీనిని ఆనుకుని ఇటుకల తయారీ కోసం కొన్నేళ్లుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటుకలకు డిమాండ్ పెరిగిన కొద్దీ ఇక్కడ మట్టి తవ్వకాలు పెరిగి కొందరు కట్టకు పక్కనే తవ్వకాలు చేయడంతో గండి బాగా విస్తరించింది. ఇక్కడి పొలాలను కొనుగోలు చేసిన ఇటుక వ్యాపారులు మట్టి ఎంత లోతు వరకు వస్తే అక్కడి వరకు తవ్వకాలు చేశారు. విద్యుత్తు స్తంభం కంటే లోతుకు ఇక్కడ తవ్వకాలు చేశారు. కట్టకు సమీపంలోనే అత్యంత లోతుకు తవ్వకాలు చేయడం వల్ల కట్ట బలహీనమై ఏటా గండి విస్తరిస్తోంది. నదికి వరద ఎక్కువగా ఉన్నప్పుడు గండి నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి పొలాలను కోతకు గురి చేస్తూ ప్రవహించడంతో భూములు కోతకు గురవుతున్నాయి. మరోవైపు కరకట్ట నుంచి లంక గ్రామాల్లోకి రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. నదికి వరద సమయంలో నీటితో పాటు కొట్టుకొచ్చిన ఇసుక మేట వేసి ఈ ప్రాంతం ఎగుడుదిగుడుగా తయారైంది. ఏటికేడు గండి విస్తరించడంతో ఇటువైపు వచ్చే నీటి పరిమాణం పెరిగి లంక గ్రామాలకు సంకటంగా మారింది. ఈ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను చుట్టుముట్టడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. గతేడాది వచ్చిన వరదకు ఇటుక బట్టీలతో పాటు పంట పొలాలు ముంపునకు గురై భారీ నష్టం వాటిల్లింది.
కట్ట కోతకు గురైన దృశ్యం
వరద వస్తే వణుకే..
కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్కుల నీటి పరిమాణం దాటితే గండి నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో పాటు పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. నది మధ్యలో ఉన్న భూములు అత్యంత సారవంతమై విలువైన వాణిజ్య పంటలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.లక్షల ధర పలుకుతోంది. ఇక్కడ సాగు చేసేవారందరూ సన్న, చిన్నకారు రైతులే. అర ఎకరం, ఎకరం, రెండెకరాలలోపు భూములు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారికి వరద వచ్చిన ప్రతిసారి పదిసెంట్ల నుంచి 20సెంట్ల వరకు భూమి కోతకు గురై నదిలో కలిసిపోవడంతో కొన్నాళ్లకు పూర్తిగా భూమి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ సాగు చేసే కంద, అరటి, బొప్పాయి, పసుపు, తమలపాకులు, నిమ్మ ఇలా అత్యంత ఖరీదైన పంటలు ఉన్నాయి. ఇవి ముంపునకు గురైన ప్రతిసారి రైతులు రూ.కోట్ల విలువైన దిగుబడులు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే తమ భూమి పూర్తిగా నదిలో కలిసిపోతుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తమ భూములు కాపాడాలని పదే పదే విన్నవిస్తున్నారు. వరద సమయంలో ప్రత్యక్షంగా రైతుల అవస్థలను చూసిన నేతలు, అధికారులు అప్పటికప్పుడు ఉపశమనం కలిగేలా హామీలు ఇవ్వడం మినహా ఇప్పటివరకు నిర్మాణాత్మకంగా చేపట్టిన చర్యలు శూన్యం. నేతల హామీలు నీటి మీద రాతల్లా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలెక్కని ప్రణాళికలు
భవిష్యత్తులో గండి మరింత పెద్దది కాకుండా వరద సమయంలో భూములు కోతకు గురికాకుండా ఉండటానికి కృష్ణానది పరిరక్షణ విభాగం అధికారులు కొన్నేళ్లుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రక్షణ గోడ నిర్మించడం ద్వారా భూములు కాపాడాలని ప్రణాళికలు రూపొందించారు. తొలుత రూ.8.49 కోట్లతో అంచనాలు తయారు చేయగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మోక్షం లభించలేదు. దీంతో ప్రస్తుతం రూ.10.44 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. వీటికి కూడా నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
ప్రతిపాదనలు పంపాం
- కృష్ణారావు, కార్యనిర్వాహక ఇంజినీరు, కృష్ణానది పరిరక్షణ విభాగం
కొల్లూరు మండలంలో అరవింద వారధి ఎగువభాగంలో కట్టకు పడిన గండిని పరిశీలించాం. భూములు కోతకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత