నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం
ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు
అజెండాలో 2023-24 బడ్జెట్
గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని గుంటూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2023-24 వార్షిక సంవత్సరం అంచనా బడ్జెట్ని అజెండాలో చేర్చారు. రూ.1,154.47 కోట్ల అంచనా బడ్జెట్ని రూపొందించారు. వ్యయం రూ.1,152.96 కోట్లుగా, రూ.1.50 కోట్లు మిగులుగా అధికారులు చూపారు. జిల్లాపరిషత్తు సాధారణ నిధి వరకు 2023-24 అంచనా బడ్జెట్ రూ.61.26 కోట్లుగా.. వ్యయం రూ.60.85 కోట్లు కానున్నాయని అంచనా వేశారు. మిగులు రూ.40.71 లక్షలు చూపారు. జనవరి 29న జరిగిన ఒకటో స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ బడ్జెట్ తీర్మానాన్ని ఆమోదించారు. దీనిని అధికారులు జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదం తీసుకోనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తుగా ఆమోదించిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు అజెండాలో చేర్చారు. బడ్జెట్ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వ శాఖలపై చర్చను సభ్యులు కోరితే చర్చించే అవకాశం ఉంది.
అంకెల్లోనే నిధులు : జిల్లాపరిషత్తు బడ్జెట్ని రూ.1,154.47 కోట్లుగా చూపినప్పటికీ అందులో రూ.61.26 కోట్లు మాత్రమే జడ్పీ సాధారణ నిధికి జమయ్యేవి. మిగిలిన రూ.1,093.21 కోట్లు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఈ నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో చేపట్టే పనులు పీఆర్ అధికారులు నేరుగా చేస్తున్నవే. కనీసం జిల్లాపరిషత్తు పాలకవర్గం, అధికారుల దృష్టికి తీసుకురాకుండానే పనులు చేస్తున్నారు. ఆ నిధులను జడ్పీ బడ్జెట్లో చూపడంతో అంకెల్లో భారీగా కనిపిస్తున్నాయి. బయటి నుంచి చూసే వారికి రూ.వందల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవంగా చూస్తే జడ్పీకి ఎలాంటి పాత్ర లేదు. జడ్పీ బడ్జెట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నిధులను చూపడంపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా