తాడేపల్లి వైకాపాలో వర్గ విబేధాలు
మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని వైకాపాలో శనివారం విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లి వైకాపా పట్టణ మహిళావిభాగం అధ్యక్షురాలు సంపూర్ణ పార్వతి వైఎస్సార్ సీపీ-జగన్ యువసేన అనే వాట్సాప్ గ్రూప్లో స్థానిక వైకాపా నేతలను అగౌరవపరిచేలా ఉండే ఆడియోను శుక్రవారం మధ్యాహ్నం పోస్టు చేశారు.
తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేస్తున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ మహాలక్ష్మి, పార్టీ నేతలు కేళి వెంకటేశ్వరరావు, గోరే బాబు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-తాడేపల్లి: మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని వైకాపాలో శనివారం విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లి వైకాపా పట్టణ మహిళావిభాగం అధ్యక్షురాలు సంపూర్ణ పార్వతి వైఎస్సార్ సీపీ-జగన్ యువసేన అనే వాట్సాప్ గ్రూప్లో స్థానిక వైకాపా నేతలను అగౌరవపరిచేలా ఉండే ఆడియోను శుక్రవారం మధ్యాహ్నం పోస్టు చేశారు. ఇది స్థానిక వైకాపా నేతల్లో దుమారానికి కారణమైంది. ‘‘తాడేపల్లి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మిని ఛైర్పర్సన్ కుర్చీలో కూర్చొబెట్టి అధికారం మొత్తం మాజీ ఎంపీపీ వేమారెడ్డి చలాయించారు. ఆమె చేసింది ఏమీ లేదు. తాడేపల్లి వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు అటు ఇటు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. నిర్మల, అబ్బూ, కేళి వెంకటేశ్వరరావు, గోరే బాబు ఒక ముఠాలాగా తయారై వేణు అన్నను ఇబ్బంది పెట్టాలని చూశారు. వైకాపా వాళ్లను తెదేపాలోకి తీసుకెళ్లడానికి తాడేపల్లి పట్టణ తెదేపా అధ్యక్షుడు వెంకట్రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తాడేపల్లి పట్టణ వైకాపా అధ్యక్షుడు వేణు తీసుకెళ్లారు. కరోనా సమయంలో వేమారెడ్డి మూడేళ్లు బయటికి రాకపోవడంతో జనం మర్చిపోయారు. జనం మర్చిపోయిన నాయకుడిని మీరు ఫోన్లు చేసి బతికిస్తున్నారు. వేమారెడ్డి వర్గం వారు తెదేపా, జనసేనకు వెళతామని బెదిరిస్తే వైకాపాలో ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. వేమారెడ్డి విబేధించి పోయినప్పుడే ఎన్నికల్లో 10వేల మెజారిటీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం.’’ అని సంపూర్ణ పార్వతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఆమె పోస్టు చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో కేళి వెంకటేశ్వరరావు, తాడేపల్లి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి తమను సంపూర్ణ పార్వతి అగౌరవపరిచేలా మాట్లాడారని ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందినందున చులకనగా మాట్లాడటంతోపాటు అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందున సంపూర్ణ పార్వతిపై చర్యలు తీసుకోవాలని కొయ్యగూర మహాలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా తనను మోసగాడుగా పేర్కొనడంతోపాటు తనపై పలు ఆరోపణలు చేయడంతో మానసికంగా కుంగిపోయాయని ఇందుకు బాధ్యురాలైన సంపూర్ణ పార్వతిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాడేపల్లి వైకాపా పట్టణ గౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళతామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!