రూ.వెయ్యితో ఏం చేయాలి?
మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణానికి బడ్జెట్లో రూ.వెయ్యి కేటాయించడం పల్నాడు ప్రజల్ని విస్తుబోయేలా చేసింది. 92 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ మార్గం నిర్మాణానికి 20 ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి.
మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణం బడ్జెట్లో నిధులివీ..
కీలకమైన రైల్వే ప్రాజెక్టు అటకెక్కించడంపై విమర్శల వెల్లువ
మాచర్ల, న్యూస్టుడే
మాచర్ల రైల్వేస్టేషన్లో నిర్మించిన పరిపాలన భవనం ఇదే..
మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణానికి బడ్జెట్లో రూ.వెయ్యి కేటాయించడం పల్నాడు ప్రజల్ని విస్తుబోయేలా చేసింది. 92 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ మార్గం నిర్మాణానికి 20 ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీ-తెలంగాణ మధ్య ఈ రైలు మార్గానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే కేటాయింపులు రూ.1.50 కోట్లు లోపలనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కేవలం ఈ మార్గానికి రూ.1000 కేటాయించడం గమనించాల్సిన అంశం. ఈ ప్రాజెక్టు దస్త్రం పూర్తిగా మూసేయకుండా జీవం పోసేందుకు ఈ నామమాత్రపు కేటాయింపులు చేస్తున్నట్లు అర్థమవుతుంది.
ఇరవై సంవత్సరాల నుంచి మాచర్ల-నల్గొండ రైలు మార్గం తెర మీదకు వచ్చింది. ఈ మార్గం కోసం నరసరావుపేట, నల్గొండ ఎంపీలు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. పారిశ్రామికంగా, వ్యవసాయ వాణిజ్యపరంగా ఈ మార్గం మేలు చేస్తుందని పార్లమెంటులోనూ పేర్కొన్నారు. ప్రస్తుతం నల్గొండ-మాచర్ల మధ్య రైలు ప్రయాణం చేయాలంటే నడికూడి జంక్షన్ వరకు వెళ్లి ప్రయాణం చేయాల్సిందే. మాచర్ల-నల్గొండ మార్గం వలన దూరం తగ్గడంతోపాటు, సమయం కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్ మీదుగానే ఈ మార్గం వెళ్తుంది. దీని వలన దూరప్రాంతాల వాళ్లు రైలు మార్గం ద్వారా సాగర్ వచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని గతంలో అధికారులు పేర్కొన్నారు. 2009లో అధికంగా రూ.కోటి కేటాయించారు. మార్గం కోసం సర్వే చేయడంతో పాటు మాచర్ల రైల్వేస్టేషన్లో పరిపాలన భవనం నిర్మించారు. తరువాత నామమాత్రపు నిధులు కేటాయింపులు నేపథ్యంలో ఈ మార్గం దస్త్రం అటకెక్కింది. మాచర్ల స్టేషన్లోని భవనాన్ని ప్రత్యామ్నాయంగా మరో అవసరానికి రైల్వేశాఖ వినియోగిస్తుంది. తాజాగా కేటాయించిన రూ.వెయ్యితో ఏం చేయాలో మరి రైల్వేశాఖ నిర్ణయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె