అధిక ధరకు యూరియా అమ్మకాలపై తనిఖీలు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో శనివారం వ్యవసాయాధికారులు యూరియా అధిక ధరకు విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు.
పొన్నూరులో తనిఖీలు చేస్తున్న ఏడీఏ తిరుమలదేవి
ఈనాడు-నరసరావుపేట, న్యూస్టుడే-నకరికల్లు : గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో శనివారం వ్యవసాయాధికారులు యూరియా అధిక ధరకు విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు అధిక ధరకు అమ్ముతున్న వైనంపై ‘ఈనాడు’లో శనివారం ‘యూరియా... ఏదయా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బాపట్ల జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. చీరాల మండలంలో ఏడీఏ లక్ష్మీ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శనివారం తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో వ్యవసాయాధికారి దుకాణాలను తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. మండలంలోని నాలుగు ఆర్బీకేలకు శనివారం 60 టన్నుల యూరియాను సరఫరా చేశారు. దీంతో స్థానికంగా రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటున్నారు. పొన్నూరు పట్టణంలో ఏడీఏ తిరుమలదేవి ఆధ్వర్యంలో అధికారులు దుకాణాల్లో యూరియా నిల్వలపై తనిఖీలు చేశారు. దుగ్గిరాల మండలంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు
-
Sports News
GT vs CSK: 19వ ఓవర్ ఫోబియా.. మళ్లీ పునరావృతమవుతోందా..?
-
Politics News
Andhra News: పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు