ధాన్యం కొనేందుకు ఎన్ని కొర్రీలో...
ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్న అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్బీకే యంత్రాంగం తేమశాతం పరిశీలించి బరువు తూచి మిల్లులకు పంపిన తర్వాత కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోకుండా షరతులు పెడుతున్నారు.
తేమ శాతం తక్కువని, బరువు తగ్గిందని డబ్బులు వసూలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు
ఈనాడు, అమరావతి
పౌరసరఫరాలశాఖ పంపిణీ చేసిన తేమ కొలిచే యంత్రాల్లో తేమ శాతం కొలిచి నిర్ధారించి మిల్లుకు పంపిన తర్వాత అక్కడ వారి యంత్రాలలో తేమ శాతం పరిశీలించినప్పుడు 2 నుంచి 4 శాతం వరకు తేడా వస్తోంది. దీంతో మరో ఆర్బీకేలోని తేమ చూసే యంత్రంతో సరిచూసి మిల్లరుకు తెలియజేసిన తర్వాత దించుకుంటున్నారు. సీజన్ అయిపోయిన తర్వాత మిల్లుల్లో యంత్రాలను నిరుపయోగంగా ఉంచుతున్నారు. వీటిని క్యాలిబరేషన్ చేయించకుండానే ప్రస్తుతం వాడుతున్నందున తేడా వస్తోందని సాంకేతిక సహాయకులు చెబుతున్నారు. దీంతో కొన్నిసార్లు ధాన్యం దించడంలో మిల్లుల వద్ద జాప్యం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో ఇలాంటి సమస్య వస్తే వెంటనే పౌరసరఫరాలశాఖ అధికారులు జోక్యం చేసుకుని మిల్లరుతో మాట్లాడి సమస్య పరిష్కరించారు.
ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్న అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్బీకే యంత్రాంగం తేమశాతం పరిశీలించి బరువు తూచి మిల్లులకు పంపిన తర్వాత కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోకుండా షరతులు పెడుతున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని, కటింగ్ అవుతోందని, బరువు కొంత తగ్గిందని ఇలా పలు సాకులు చూపి తగ్గిన మేర సొమ్ము నిర్ణయించి చెల్లించిన తర్వాతే అన్లోడింగ్ చేసుకుంటున్నారు. షరతులకు రైతులు అంగీకరించకుండా వాదనకు దిగినా పట్టించుకోవడం లేదు. లారీ, ట్రాక్టర్లు మిల్లుకు వెళ్లిన తర్వాత వెంటనే బస్తాలు దించకపోతే వెయిటింగ్ ఛార్జీ కింద అదనంగా వసూలు చేస్తున్నారు. ఎలాగూ మిల్లు వరకు తీసుకువచ్చినందున ఇక తిరిగి వెళ్లలేరని కొందరు మిల్లర్లు పొంతన లేని నిబంధనలు పెట్టి సొమ్ము వసూలు చేస్తున్నారు. రైతులు ధాన్యం బస్తాలకు నింపుకుని తూకం వేసుకుని ఆర్బీకేలో ప్రక్రియ పూర్తిచేసుకుని లారీలు, ట్రాక్టర్లకు లోడ్ చేసుకుని మిల్లుకు వెళ్లేసరికి మధ్యాహ్నాం 2 గంటలు అవుతోంది. అప్పటి నుంచి రైతును వివిధ కారణాలతో సాయంత్రం వరకు వేచిఉండేలా చేస్తున్నారు. సాయంత్రం తర్వాత ఏదో ఒక కొర్రీ వేసి సొమ్ము చెల్లిస్తేనే దించుకుంటామని షరతులు విధిస్తున్నారు. దీంతో రైతు చేసేదిలేక విసిగిపోయి అడిగినంత సొమ్ము ఏదొక రకంగా చెల్లించి ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్బీకే సిబ్బంది సూచించిన వేబ్రిడ్జి వద్ద ట్రాక్టరు లేదా లారీ బరువు తూచి మిల్లుకు తీసుకెళితే అక్కడ వారు సూచించిన వేబ్రిడ్జి యంత్రం వద్ద మళ్లీ బరువు చూస్తున్నారు. ఈక్రమంలో 30 కిలోల నుంచి 120 కిలోల వరకు లారీకి తగ్గుదల వస్తోంది. ఇలా తగ్గిన ధాన్యానికి కిలోకు రూ.20 చొప్పున రైతు మిల్లర్లకు అప్పటికప్పుడే చెల్లించాలి. ఇలా తేడా ఎందుకు వస్తుందని రైతులు అడిగితే వేబ్రిడ్జికి, వేబ్రిడ్జికి తేడా ఉంటోందని, తామేమి చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు. ఇలా పలు కారణాలతో రైతులకు బ్యాంకులో మద్దతు ధర మేరకు సొమ్ము జమ అవుతున్నా మిల్లర్లకు చెల్లించే సొమ్ము, ఎత్తుడు, దించుడు కూలీలు, హమాలీ మామూలు అన్నీ కలుపుకుంటే మద్దతు ధర దక్కడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఆర్బీకే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే సిబ్బంది ధాన్యం నాణ్యత, తేమశాతం చూసిన తర్వాతే పంపుతున్నా కొందరు మిల్లర్లు అంగీకరించడం లేదు. మిల్లులో ఉన్న తేమ శాతం చూసే యంత్రంలో వచ్చిన శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బాపట్ల జిల్లాలో రైతు ఒకరు ధాన్యాన్ని ఆర్బీకేలో మద్దతు ధరకు విక్రయిస్తే కారంచేడు మండలంలోని ఓ మిల్లుకు తరలించాలని సిబ్బంది సూచించారు. ట్రాక్టర్లలో అక్కడికి ధాన్యం మిల్లుకు తీసుకెళితే ధాన్యాన్ని పరిశీలించిన మిల్లు యజమాని ఈ-పంటలో నమోదు చేసిన రకానికి, మిల్లు తెచ్చిన ధాన్యం రకానికి తేడా ఉందని పేచీ పెట్టారు. ఎట్టకేలకు సాయంత్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతు రూ.20వేలు చెల్లిస్తేనే ధాన్యాన్ని రాత్రివేళ దించుకున్నారు. మిల్లరుతో చర్చల్లో విసుగు చెందిన రైతు ఓ దశలో ధాన్యం వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధంకాగా ఒక వాహనంలో తీసుకురావాల్సిన ధాన్యాన్ని రెండు వాహనాల్లో తెచ్చినందున దారిలో పోలీసులు అడ్డుకుంటారని, మరో మిల్లరు కొనుగోలు చేయరని చెప్పి రైతుపై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు