ఉగాదికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సిందే
ఉగాది నాటికి జగనన్న కాలనీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్థానిక అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్
రేపల్లె అర్బన్, న్యూస్టుడే: ఉగాది నాటికి జగనన్న కాలనీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్థానిక అధికారులను ఆదేశించారు. రేపల్లె 18 వార్డు శివారున ఏర్పాటు చేసిన లేఔట్ను ఆమె శనివారం సందర్శించారు. వీఆర్వో సంస్థ ఆధ్వర్యంలో యానాదులకు నిర్మిస్తున్న 140 ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. కష్టపడి ఇల్లు నిర్మించుకుంటున్నారు.. ఎంత కష్టమొచ్చినా అమ్ముకోవద్దని మహిళలకు హితవు పలికారు. ఇంటి నిర్మాణ పనుల్లో తలమునకలై పనులకు వెళ్లనందున నా వంతుగా కుటుంబానికి 25 కిలోల చొప్పున 140 కుటుంబాలకు బియ్యం ఇస్తున్నానంటూ ఆయా కుటుంబాలకు పంపిణీ చేయించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షలతో పాటు పొదుపు సంఘాల సభ్యులకు రూ.35 వేలు చొప్పున రుణం ఎంతమందికి ఇచ్చారని ఆర్పీలను అడగ్గా సరైన సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ శాఖ పీడీ జేవీఎస్కెవి ప్రసాద్, డీఈ ఏవీ సుబ్బారావు, తహసీల్దారు వీరవసంతరావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, కమిషనర్ విజయసారథి, వీఆర్వో సంస్థ ప్రతినిధి వేలంగినిరాజు, ఏఈలు అనిత, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
170 విద్యుత్తు మోటార్ల చోరీపై ఫిర్యాదు
రేపల్లె జగనన్న కాలనీలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇనుము, ఇటుక, ఇసుక, కంకర వంటి ఇంటి నిర్మాణ సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోతున్నారంటూ కాలనీని సందర్శించిన కలెక్టర్ విజయకృష్ణన్కు లబ్ధిదారులు శనివారం ఫిర్యాదు చేసి చోరీల కట్టడికి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు 170కి పైగా విద్యుత్తు మోటార్లు దొంగతనానికి గురయ్యాయని మొరపెట్టుకున్నారు. కష్టపడి పనులు చేసి కూడబెట్టుకున్న నగదుతో ఇంటి నిర్మాణ సామగ్రి కొనుగోలు చేస్తే రాత్రికిరాత్రే మాయమవుతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇలా దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వారి నుంచి రికవరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎస్సై భరత్కుమార్ ఆమెకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి
[ 20-04-2024]
రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. -
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?