కారుచౌకగా క్యాంటీన్ అద్దె ఖరారు
జిల్లా ఆస్పత్రిలోని క్యాంటీన్ను ఓ గుత్తేదారునికి కారుచౌకగా అద్దెను ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు దారి తీస్తోంది.
తెనాలి(కొత్తపేట), న్యూస్టుడే
ఆస్పత్రి ప్రాంగణంలో క్యాంటీన్ నడిపిన ప్రదేశం ఇదే.
జిల్లా ఆస్పత్రిలోని క్యాంటీన్ను ఓ గుత్తేదారునికి కారుచౌకగా అద్దెను ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు దారి తీస్తోంది. గతంలో చెల్లించిన నెలసరి అద్దెలో సగానికే దీనిని ఖరారు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీనిలో మితిమీరిన రాజకీయ జోక్యం, టెండర్ నిబంధనలను సక్రమంగా పాటించక పోవడంతో ప్రభుత్వ ఖజనాకు గండి పడుతోందని పలువురు చెబుతున్నారు. చాలా సంవత్సరాల తరవాత టెండర్లు పిలిచిన జిల్లా ఆస్పత్రి వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రోగులు, వారి సహాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులకు అల్పాహారం, భోజనం తదితరాలను తయారు చేసి అమ్మేందుకు క్యాంటీన్ నెలకొల్పారు. దాన్ని అద్దె ప్రాతిపదికన నడుపుకొనేందుకు నిర్దేశించిన సంవత్సరాలకు టెండర్ పిలిచి నెలసరి అద్దె ధర ఖరారు చేస్తారు అధికారులు. వారు కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించారా లేదా అని చూసి అన్నీ కచ్చితంగా ఉన్నావారిలో ఎక్కువ అద్దె ధరని కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రి అధికారులు కరోనాకు ముందు క్యాంటీన్ బాడుగ ఖరారు టెండర్లను పిలవగా ఓ కాంట్రాక్టరు నెలకి రూ.25వేలు అద్దె చొప్పున కోడ్ చేసి దాన్ని దక్కించుకున్నాడు. అది కాలపరిమితి ముగిసిన తరవాత కరోనా వ్యాప్తి తదితర కారణాలతో మరోసారి టెండర్ పిలవడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఎట్టకేలకు అధికారులు ఇటీవల అర్హులైన గుత్తేదార్ల నుంచి ఆ భోజన,అల్పాహారశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. వారు వరుసగా నెలసరి అద్దె కింద రూ.40వేలు, రూ.36వేలు, రూ.32వేలు కోడ్ చేశారు..అధికారులు వారు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులు లేరని నిర్ధారించారు కానీ. అత్యధిక అద్దె ధర రూ.40వేలు కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేశారు. కానీ ఆ అద్దె ధర అత్యధికమని భావించి .నాలుగో వంతు ధరకు ఇవ్వమని అధికారులను కలసి కోరారు. దీనికి భిన్నంగా రూ.36వేలు, రూ.32వేలు కోడ్ చేసిన వారు అవే ధరలకు ఇస్తే తీసుకుంటామని కోరినా, ఇవ్వకుండా ఆ టెండర్లను రద్దు చేశారు అధికారులు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు దాన్ని వద్దనుకునేటట్లయితే వారి డిపాజిట్ నగదును అధికారులు వాపసు ఇవ్వరు. కానీ అధికారులే దాన్ని రద్దు పరిచి వారికి నగదును వాపసు ఇచ్చారు. ఆ క్యాంటీన్కు తాజాగా మరోసారి టెండర్ పిలిచారు. ఈ సారి నిబంధనల ప్రకారం ధువ్రపత్రాలను సమర్పించిన వారిలో అత్యధిక నెలసరి అద్దె ధర రూ.11,500లు కోడ్ చేసిన వారికి దాన్ని ఖరారు చేశారు. ఇది గతంలో చెల్లించిన రూ.25వేల కన్నా తక్కువ కావడం గమనార్హం.
అధికారులు పాటించిన నిబంధనలతో రూ.40వేలకు టెండర్ దక్కిన గుత్తేదారు తీసుకోకున్నా నగదు వాపసు వచ్చింది. అద్దె ధర బాగా తగ్గింది. ఇక్కడ హాస్పిటల్ కన్నా వ్యక్తికి నష్టం కలగకుండా ఉండేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.. జిల్లా ఆస్పత్రి క్యాంటీన్ అద్దె ధర ఖరారు టెండర్లను ఉన్నతాధికారులే నిర్వహించారు.
టి.సౌభాగ్యవాణి. సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.