logo

భార్య పుట్టింటికి.. మనస్తాపంతో భర్త బలవన్మరణం

భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో భర్త ఉరేసుకుని బలవన్మరణం చెందిన సంఘటన శనివారం ఉదయం ధేనువకొండ పునరావాస కాలనీ(బలరామకృష్ణపురం)లో చోటుచేసుకుంది.

Published : 05 Feb 2023 04:32 IST

తంగిరాల సుబ్బరావు

ధేనువకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో భర్త ఉరేసుకుని బలవన్మరణం చెందిన సంఘటన శనివారం ఉదయం ధేనువకొండ పునరావాస కాలనీ(బలరామకృష్ణపురం)లో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్‌.ఆదిలక్ష్మి అందించిన సమాచారం మేరకు.. పునరావాస కాలనీలో నివసించే తంగిరాల సుబ్బారావు (32), భార్య మధ్య మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు రోజుల క్రితం ఆమె జే పంగులూరు మండలం రామకూరులోని పుట్టింటికి వెళ్లింది. ఆమె వెళ్లిన నాటి నుంచి ముభావంగా ఉంటున్న సుబ్బారావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత ఇంట్లోని ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకున్నాడు. తెల్లారిన తరువాత గుర్తించిన కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆమేరకు మృతదేహానికి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి ఇద్దరు కుమారులున్నారు. సోదరుడు మరియదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని