logo

తెగిపోయిన గూడ్స్‌ రైలు లింక్‌

ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు లింకు తెగిపోవడంతో ఆదివారం పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

Published : 06 Feb 2023 05:33 IST

మధిర సమీపంలో లింక్‌ తెగిపోయిన గూడ్స్‌ రైలు

మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు లింకు తెగిపోవడంతో ఆదివారం పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు లింకు ఖమ్మం జిల్లా మధిర పట్టణం సమీపంలోని వైరానది బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెగిపోయింది. విడిపోయిన బోగీలతో సహా ఇంజిన్‌ అరకిలోమీటరు దూరం వెళ్లి ఆగిపోయింది. గార్డ్‌, డ్రైవర్‌ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. తర్వాత బోగీలను తీసుకొచ్చి గూడ్స్‌కు కలిపారు. మోటమర్రి రైలు నిలయంలో కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 3 గంటలపాటు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

రైల్వే విద్యుత్తు తీగ తెగి...

తాడేపల్లి, న్యూస్‌టుడే: విజయవాడ - తెనాలి రైలు మార్గంలో విద్యుత్తు తీగ తెగిపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణా కెనాల్‌ రైల్వే జంక్షన్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం 5.50 గంటల సమయంలో విద్యుత్తు తీగ తెగిపడినట్లు రైల్వే అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఎక్కడిక్కడ రైళ్లను నిలిపివేశారు. దుగ్గిరాల రైల్వేస్టేషన్‌లో తిరుపతి - హౌరా ఎక్స్‌ప్రెస్‌, తెనాలిలో విజయవాడ పాసింజర్‌ గంట చొప్పున ఆగిపోయాయి. విద్యుత్తు లైను ఓహెచ్‌ టవర్‌ కార్‌తో రైల్వే అధికారులు వెళ్లి తీగలను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని