నిలిచిన టీకాల సరఫరా
పసి పిల్లల ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాల సరఫరా నిలిచిపోయింది. టీకాలు సరఫరా చేసే వాహనాలకు డీజిల్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు నిధుల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తడడమే దీనికి కారణం.
షెడ్డులో ఆగి ఉన్న టీకా సరఫరా వాహనం
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: పసి పిల్లల ప్రాణాలను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాల సరఫరా నిలిచిపోయింది. టీకాలు సరఫరా చేసే వాహనాలకు డీజిల్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు నిధుల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తడడమే దీనికి కారణం. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన టీకాలను గుంటూరు డీఎంహెచ్వో కార్యాలయంలోని ప్రాంతీయ టీకా నిల్వ కేంద్రం నుంచే సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన వాహనాలు, బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు రావడంతో టీకాలు ఎప్పుడు పంపిణీ జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు ప్రతి బుధ, శనివారాల్లో పిల్లలకు, గర్భిణులకు అవసరమైన టీకాలు ఇస్తుంటారు. ప్రకాశం జిల్లాలో టీకాల నిల్వ తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి అవసరమైన టీకాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పని చేస్తున్న సుమయఖాన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఆదేశాలిచ్చారు. గతనెల 10వ తేదీన ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా హనుమంతురావు బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఆయనకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. జాతీయ ఆరోగ్య పథకం కింద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకునేందుకు వీలు పడటంలేదు. దీంతో డీజిల్ కొనుగోలుకు అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా వాహనాలు కదలడంలేదు. దీనివల్ల టీకాలు ఇతర జిల్లాలకు సరఫరా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..