వలపు వల.. బైక్ మెకానిక్ విలవిల!
‘మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంచి వారులా కనిస్తున్నారు. నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు. అతని బాధలు భరించలేకున్నా.
నెహ్రూనగర్(గుంటూరు), న్యూస్టుడే: ‘మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంచి వారులా కనిస్తున్నారు. నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు. అతని బాధలు భరించలేకున్నా. ఆయనకు విడాకులిచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటూ’ ఓ వృద్ధుడికి వలపు వల విసిరి నిలువ దోపిడీ చేసిన వైనంపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ‘పొన్నూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి అక్కడ బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అతని భార్య ఎనిమిదేళ్ల కిందట మృతి చెందింది. ఈ క్రమంలో ఓ వివాహిత అతనికి సెల్ఫోన్ నంబర్ సేకరించి మాట్లాడింది. తన ద్విచక్ర వాహనం రిపేరు చేయాలంటూ కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత మీరు బాగా మాట్లాడుతున్నారు.. మంచి వారంటూ మాటలు కలిపింది. అలా కొద్ది రోజులు ఫోన్లో ముచ్చట్లు చెబుతూ ఆకట్టుకుంది. అంతటితో ఆగకుండా తన అమ్మతో మాట్లాడమని ఫోన్ ఇచ్చింది. కిలాడీ లేడీ అమ్మ ఇంకొంచెం మాయచేస్తూ.. ‘మా అల్లుడు చెడ్డవాడు. అతనికి రూ.3 లక్షలు ఇస్తే తెగతెంపులు చేసుకుంటాం. మూడు నెలల్లో విడాకులు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంద’ని నమ్మించింది. వాళ్ల మాటలు నమ్మిన మెకానిక్ తన వద్ద ఉన్న రూ.లక్ష ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత కుమార్తె మెకానిక్కు ఫోన్ చేసి ‘నా భర్త కొడుతున్నాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెడుతున్నాడని వగలమారి ఏడుపు ఏడ్చింది. నా భర్తకు డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుందామని మా బంధువు వద్దకు వెళితే అతను తన కోరిక తీర్చమంటున్నాడంటూ కొత్త నాటకం ఆడింది. నీవు మరో రూ.రెండు లక్షలు ఇస్తే నా మొగుడికి ఇచ్చేసి రేపు తెల్లాసరికల్లా నీ దగ్గరకు వచ్చేస్తా. నీకు భార్యను అయిపోతానంటూ మాట్లాడింది. ఒంటరి జీవితం గడుపుతున్న ఆ వృద్ధుడు ఆ కిలాడీ లేడీ మాటలకు కరిగిపోయి అప్పు చేసి రూ.1.20 లక్షలు ఇచ్చాడు. అవి తీసుకొని బాధపడకు తనకు బ్యాంకు అధికారులు తెలుసు రూ.5 లక్షలు లోన్ ఇప్పిస్తానంటూ అక్కడ నుంచి పలాయనం చిత్తగించింది. రోజులు గడచినా ఆమె రాలేదు. పైగా ఇంకా డబ్బులు కావాలంటూ కొత్త నాటకం ఆడటంతో అనుమానం వచ్చి విచారిస్తే తల్లి, కుమార్తెలు కలిసి ఇలా నాటకాలు ఆడి నగదు దోచుకుంటుంటారని తెలుసుకున్నాడు. ఆ మహిళ తన భర్తతో హాయిగా కలిసి ఉంటూ తల్లితో పాటు అందరూ మద్యం తాగడం, బిర్యానీ తింటూ జల్సాలు చేస్తూ ఒంటరిగా ఉండే మగవాళ్లను మోసగిస్తుంటారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు