అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
స్పందన, రెవెన్యూ అర్జీల పరిశీలనకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి హెచ్చరించారు.
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, చిత్రంలో జేసీ రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖర్రావు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: స్పందన, రెవెన్యూ అర్జీల పరిశీలనకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీలు మళ్లీ తెరుచుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలను అధికారులు స్వయంగా పరిశీలించాలన్నారు. వాటిని పరిష్కరించి నివేదిక అందించాలన్నారు. ఏపీ సేవ పోర్టల్లో ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే పరిష్కరించాలన్నారు. శ్మశాన వాటికలకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్తో పాటు జేసీ జి.రాజకుమారి, డీఆర్వో కె.చంద్రశేఖర్రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వెంకటశివరామిరెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో 143 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.
అంబేడ్కర్ భవన నిర్మాణం పూర్తి చేయాలని వినతి
గుంటూరు నగరంలోని అంబేడ్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ఎస్సీడబ్ల్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిద బాబూరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్.ఐజాక్ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. 11 ఏళ్లుగా అంబేడ్కర్ భవనం అభివృద్ధికి ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు ఇస్తున్నామని తెలిపారు.
రుణం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు: నంబూరు విజయభాస్కర్రావు
నాది పెదకాకాని మండలంలోని నంబూరు. నాకు ఎంఎస్ఎంఈ కింద రూ.10 లక్షల రుణం మంజూరైంది. సీజీజీబీ బ్యాంకు నంబూరులోనే ఖాతా ఉండటంతో అదే బ్రాంచికి రుణం బదిలీ చేస్తామని చెప్పారు. రుణం వచ్చినప్పటి నుంచి బ్యాంకు అధికారులు తిప్పుతున్నారు. తన సోదరి ఓ బ్యాంకు శాఖలో ఉద్యోగి. రుణానికి ఆమె హామీగా ఉంటానని చెప్పారు. రుణం కోసం గతేడాది జూన్ నుంచి బ్యాంకు అధికారిని సంప్రదిస్తున్నా ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో నంబూరులో పెద్ద సంఖ్యలో రుణాలు మంజూరు చేశారు. వారికి డబ్బులు కూడా ఖాతాలో జమ చేశారు. నాకు మాత్రం ఇవ్వలేదు. గ్రామంలో సౌండ్ బాక్సులు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నా. ఈ రుణంతో వ్యాపారం మరింత వృద్ధి చేసుకుందామంటే అవకాశం లేకుండా పోతుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
సమీప బంధువే పొలం కాజేసే ప్రయత్నం
అంజనాదేవి
కలెక్టరేట్(గుంటూరు): ‘పుట్టింటివారు పసుపు కుంకుమ కింద పెళ్లప్పుడు ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం. సమీప బంధువే ఆ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓసారి కోర్టుకెళ్లి ఓడిపోయినా మరోసారి వేరే మార్గంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’.. అని వాపోయారు తెనాలి మండలం కొలకలూరుకు చెందిన అంజనాదేవి. ఆమె మాట్లాడుతూ .. ‘గ్రామంలోని 133/7 సర్వే నెంబర్లో నాకు 50 సెంట్ల పొలం ఉంది. దీనిపై సొసైటీలో పలుమార్లు రుణం పొందాం. సమీప బంధువు గతంలో ఇది తన భూమి అని కోర్టులో కేసు వేసి ఓడిపోయారు. ఇప్పుడు సర్వే నెంబర్ ఒకటేననే వంకతో భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఇటీవల తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. అప్పటి వరకు అడంగల్ నా పేరుతో ఉండగా ప్రస్తుతం రెడ్మార్క్ చేశారు. దీనిపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయని చెప్పి అధికారులు అర్ధంతరంగా నోటీసు పంపి ఆ భూమి అతని పేరుతో మార్చుతున్నామని, కోర్టు తీర్పు వచ్చాక అప్పటి పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి’.. అని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!