ఆధారం దూరమై.. బతుకు భారమై..
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు (70), సామ్రాజ్యం (65) అలియాస్ సాంబులుది అన్యోన్య దాంపత్యం.
దమ్మాలపాడులో వృద్ధ దంపతుల బలవన్మరణం
వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం (పాతచిత్రాలు)
జీవిత చరమాంకంలో చెయ్యిపట్టి నడిపించాల్సిన పిల్లలెవరూ దగ్గరిగా లేరు.. ఇంటి దీపమైన ఇల్లాలు మంచాన పడింది.. ప్రేమ, ఆప్యాయతలు పెంచుకున్న వారి మరణాలు కుంగదీశాయి.. ప్రతి అవసరానికి వేరొకరిపై ఆధారపడటం కష్టంగా అనిపించింది.. బతుకు భారమై.. జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు బలవన్మరణం చెందారు. చిన్న కుమారుడి దంపతుల్ని ఇంటికి పిలిపించుకుని వారితో మనసారా మాట్లాడిన తర్వాత పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు
దమ్మాలపాడు (ముప్పాళ్ల), న్యూస్టుడే: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు గ్రామానికి చెందిన అన్నెం వెంకటేశ్వర్లు (70), సామ్రాజ్యం (65) అలియాస్ సాంబులుది అన్యోన్య దాంపత్యం. వారిద్దరూ కష్టజీవులు. వ్యవసాయాన్నే నమ్ముకుని కుమార్తె, ఇద్దరు కుమారుల్ని పెంచి పెద్ద చేయడమే కాకుండా వారికి ఎంతోకొంత ఆస్తుల్ని సమకూర్చారు. కుమార్తె రాగమ్మను గ్రామంలోని వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమారుడు మస్తాన్రావుతోపాటు ఆయన కుమారుడు లీలాప్రసాద్ అంటే వారికి ప్రేమ. లీలాప్రసాద్ 2019లో బలవన్మరణం చెందాడు. మనువడి మరణం నుంచి కోలుకోకముందే కుమారుడు కిడ్నీ సమస్యతో మూడేళ్ల కిందట మృతి చెందాడు. కుమారుడి వైద్యంతోపాటు కుటుంబానికి చేసిన అప్పుల్ని ఎకరన్నర పొలం అమ్మి తీర్చారు. చిన్న కుమారుడు వెంకట్రావు, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితమే నరసరావుపేట వెళ్లి అక్కడే నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు మస్తాన్రావు ఇంటి పక్కనే ఉన్న పోర్షన్లో వృద్ధ దంపతులు ఉంటున్నారు. సామ్రాజ్యం నరాల సంబంధ సమస్యతో రెండేళ్ల కిందట మంచాన పడింది. అప్పట్నుంచి ఆమెకు అన్నీతానై వెంకటేశ్వర్లు చూసుకుంటున్నారు. మస్తాన్రావుకు ఆయన సతీమణి బాలమ్మ ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకోవాలనే ప్రయత్నం చేశారు. భర్త చనిపోయిన తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. గ్రామంలోని దొడ్డిస్థలం తీసుకుని వృద్ధ దంపతుల్ని చూడాలని కోరినా అనారోగ్యంతో బాలమ్మ ముందుకు రాలేదు. దీంతో కుమార్తె రాగమ్మకు ఐదు నెలలక్రితం ఆ స్థలాన్ని రాసిచ్చారు. అప్పట్నుంచి ఆమె ఇంటికి వెంకటేశ్వర్లు వెళ్లి భోజనంచేసి భార్యకు తెచ్చి పెడుతున్నారు. తల్లిదండ్రుల్ని కుమార్తె బాగానే చూసుకుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏం జరిగిందో ఏమో.. వృద్ధ దంపతులకు ఏమనిపించిందో నరసరావుపేటలో నివాసముంటున్న చిన్న కుమారుడు వెంకట్రావును రమ్మని కబురు పంపారు. వెంకట్రావు, అంజమ్మ దంపతులు ఆదివారం ఇంటికి రావడంతో వారితో రాత్రి 10 గంటల వరకు మాట్లాడుతూ గడిపారు. మీకేం కాదు మేం చూసుకుంటామని కుమారుడు వారికి ధైర్యం చెబితే.. మీరు జాగ్రత్త అంటూ వారినే ఆ దంపతులు సముదాయించారు. ఆ తరువాత ఇంటి లోపల చిన్న కుమారుడి దంపతులు నిద్రపోయారు. ఆరుబయట నిద్రించిన వృద్ధ దంపతులు పురుగు మందుతాగి చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున బయటకు వచ్చిన కోడలు విగతజీవులుగా పడి ఉన్న అత్తామామల్ని చూసి షాక్కు గురయ్యారు. అమ్మానాన్న ఇలా చేస్తారని ఊహించలేదని కుమారుడు వెంకట్రావు, కుమార్తె రాగమ్మ కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకుని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వృద్ధ దంపతుల మృతదేహాల్ని సందర్శించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జనసేన నాయకుడు వెంకటఅప్పారావు సహకారంతో రూ.10 వేలు నగదును అందజేశారు. వృద్ధ దంపతులు అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో మృతి చెందినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ కుటుంబీకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీలా మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)