కిడ్నీ భద్రం సుమా!
మాచర్లకు చెందిన సుబ్బారావు (25) తీవ్రమైన నీళ్ల విరేచనాలతో గుంటూరు సర్వజనాసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమైనట్లు గుర్తించిన వైద్యులు డయాలసిస్ చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు.
మాచర్లకు చెందిన సుబ్బారావు (25) తీవ్రమైన నీళ్ల విరేచనాలతో గుంటూరు సర్వజనాసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమైనట్లు గుర్తించిన వైద్యులు డయాలసిస్ చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు.
తెనాలికి చెందిన లక్ష్మి(22) ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు వచ్చి అది మూత్రపిండ వైఫల్యానికి దారి తీసినట్లు వైద్యులు గుర్తించి డయాలసిస్ చేయడంతో ఆమె కోలుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
గుంటూరు వైద్యం, న్యూస్టుడే
మూత్రపిండాలు.. గట్టిగా పిడికెడంత పరిమాణంలో కూడా ఉండవు గానీ.. ఈ రెండూ మన శరీరంలో ఉన్న భారీ శుద్ధి కర్మాగారాల వంటివి. నిరంతరం రక్తం నుంచి మలినాలను వడబట్టేస్తూ.. మన శరీరంలో శుభ్రతా కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉంటాయి. చక్కటి ఆరోగ్యంతో మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఇవి సజావుగా పని చేస్తుండటం, వీటి వడపోత సమర్థంగా ఉండటం చాలా అవసరం. ఆధునిక కాలంలో మూత్రపిండాలకు అడుగడుగునా గండాలే ఎదురవుతున్నాయి. మన జీవనశైలి కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతూ.. అంతిమంగా ఇవి మూత్రపిండాలను బలి తీసుకుంటున్నాయి. ఈ రుగ్మతల కారణంగా ‘దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి’ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కిడ్నీలను కాపాడుకోవడం, కిడ్నీ జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం, అవి దెబ్బతినకుండా ముందుగానే గుర్తించడం మనందరి విధి అని ప్రపంచ కిడ్నీ దినం నినదిస్తోంది. దీనిపై ‘న్యూస్టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
జీజీహెచ్లో డయాలసిస్ ఉచితం
డయాలసిస్ ప్రాణదాయని. కిడ్నీలు విఫలమైనవారి పాలిట సంజీవని. జీజీహెచ్లో డయాలసిస్ ఉచితంగా చేస్తున్నారు. ఒంట్లోని ప్రతి కణానికీ అత్యవసరమైన ఆక్సిజన్ను, పోషకాలను చేరవేసే రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు రెండూ చేతులెత్తేసినపుడు.. శరీరంలో వ్యర్థాలు, విషతుల్యాలు, నీరు అంతకంతకూ ఎక్కువవుతూ గుండె వంటి కీలకావయవాలు భారం మోయలేక పడకేస్తున్నప్పుడు బయటి నుంచే రక్తాన్ని జల్లెడ పడుతూ కిడ్నీలు చేసే పనిని సమర్థంగా నిర్విర్తిస్తూ ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్న అద్భుత వరం. కానీ డయాలసిస్ విధానంపై సరైన అవగాహన లేక ఇంతటి వరాన్ని సద్వినియోగం చేసుకోలేక ఎంతోమంది ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు.
బుధ, శనివారాల్లో పరీక్షలు
పొరుగు రోగుల విభాగం 18వ నంబరు గదిలో బుధ, శనివారాల్లో రోగులను పరీక్షిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైతే 218 వార్డులో చేర్చుకుంటారు. అత్యవసర చికిత్స 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు తప్పకుండా తీసుకురావాలి.
జబ్బు తెలుసుకోవడానికి తేలికైన పరీక్షలు
కిడ్నీల పనితీరు తగ్గిపోతూ, అవి విఫలమవడం మొదలైనా తొలి దశలో ఎలాంటి బాధలూ ఉండవు. బాధలు మొదలయ్యే సరికే నష్టం ఆరంభమైపోతుంది. కాబట్టి మనం ముందు నుంచే మూత్రపిండాలపై ఒక కన్నేసి ఉండటం అవసరం. ఏడాదికి ఒకసారైనా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మూత్ర పరీక్ష చేయించుకుని, దానిలో సుద్ద(ఆల్బుమిన్) పోతుందేమో చూసుకోవాలి. సాధారణంగా కిడ్నీల పనితీరు తెలుసుకునేందుకు రక్త పరీక్ష చేసి ‘సీరమ్ క్రియాటినైన్’ ఎలా ఉందన్నది చూస్తుంటారు. అయితే ఇదొక్కటే కాకుండా కిడ్నీల వడపోత ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఈజీఆర్ఎఫ్ చేయించుకోవడం అవసరం. మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. రోజుకి అరగంట వ్యాయామం చేయడం మంచిది. బాధితులు వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయాలి. సర్వజనాసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత చికిత్సలను రోగులు వినియోగించుకోవాలి.
మహమ్మద్ అస్లాం, సహాయ ఆచార్యులు, నెఫ్రాలజీ విభాగం, జీజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?