వెన్ను విరిచిన వాన
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షం కర్షకులను కోలుకోలేని దెబ్బతీసింది. అరటి, మామిడి, జామ పండ్ల తోటలతోపాటు తమలపాకు, మొక్కజొన్న, మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది
అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం వద్ద ఆరబోసిన మిరప కాయలపై కప్పేందుకు పట్టా తీసుకెళ్తున్న రైతులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షం కర్షకులను కోలుకోలేని దెబ్బతీసింది. అరటి, మామిడి, జామ పండ్ల తోటలతోపాటు తమలపాకు, మొక్కజొన్న, మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లింది. రోజుల వ్యవధిలో కోతకు సిద్ధమైన అరటి గెలలు నేలవాలడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. కండె దశలో ఉన్న మొక్కజొన్న పంట గాలుల తీవ్రతకు వెన్ను విరిగి కిందపడిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పడిపోవడంతో దిగుబడులపై ప్రభావంతోపాటు కూలీల ఖర్చులు బాగా పెరుగుతాయి. ఏడాది మామిడి చెట్లలో పూత, కాయలు రాలిపోవడంతో అనుకోని నష్టం జరిగింది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నందున కర్షకులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా పంటల నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మిర్చి రైతుల అవస్థలు వర్ణనాతీతం. కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి వడగళ్ల వానకు రాలిపోయింది. కాయలు నాణ్యత దెబ్బతిని తాలుకాయలు అవుతున్నాయి. కోత కోసి కల్లాల్లో అరబెట్టిన మిర్చి మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో పట్టల కింద ఉంచడంతో బూజు పడుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో ఆరుబయట మిర్చి ఎండబెట్టే పరిస్థితి లేక ఏంచేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. రంగు మారిన మిర్చి వివరాలు సైతం సేకరించారు. అయితే ఇప్పటివరకు మిర్చి కోత తర్వాత తడిస్తే నష్ట పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున కల్లాల్లో తడిచిపోయి రంగు మారిన, మిరప మొక్కల్లోనే రంగు మారిన మిర్చిని కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అరటి రైతు ఆవేదన
దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరికొన్ని రోజుల్లో కోతకు సిద్ధమయ్యే గెలలు గాలుల తీవ్రతకు కింద పడిపోయాయి. అరటి చెట్లు సైతం ఎక్కడికక్కడ విరిగిపోయి నేలవాలాయి. పంట చేతికి వచ్చే దశలో వచ్చిన అకాల వర్షంతో కూడిన గాలులు నిలువునా ముంచేశాయని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి చెట్లు నేలవాలిపోవడంతో పూర్తిగా పనికి రాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. తమలపాకు, కూరగాయల తోటలు గాలులకు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మూడు మండలాల పరిధిలో అరటి 208 హెక్టార్లు, తమలపాటకు తోటలు 4 హెక్టార్లు, కూరగాయల తోటలు 8 ఎకరాల్లో నష్టపోయారు. పల్నాడు జిల్లాలో నకరికల్లు, ఈపూరు, రాజుపాలెం, రొంపిచర్ల, బెల్లంకొండ, మాచవరం, పిడుగురాళ్ల, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అరటి, టమోటా, కాకరకాయ, పొట్లకాయ, మామిడి, బొప్పాయి, మునగ, మిర్చి పంటలు 103.14 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో అరటి 12 ఎకరాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
మొక్కజొన్న రైతు ఆశలు ఆవిరి
మొక్కజొన్న పంట ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. సుడిగాలుల తీవ్రతకు నేలవాలి మొక్కజొన్న విరిగిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న విరిగినా పెద్దగా నష్టం లేదు కానీ కండె దశలో ఉన్న మొక్కజొన్న విరిగి నేలవాలి పోవడంతో సాగుదారుల ఆశలు ఆవిరయ్యాయి. మొక్కజొన్న నేలవాలడంతో కంకులు పాలుపోసుకుని గింజ గట్టిపడే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో నేలవాలిన పంట వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొక్కజొన్నలో అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా యూరియా వాడటం వల్ల పంట ఏపుగా పెరిగింది. ఎత్తుగా పెరిగిన పంట గాలుల తీవ్రతకు నేలవాలింది. గుంటూరు జిల్లాలో 69 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని మండలాల్లో ప్రాథమికంగా 1220 హెక్టార్లలో మొక్కజొన్న, జొన్న 100 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పల్నాడు జిల్లాలో 14వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న సాగు చేయగా 1313 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ లెక్క తేల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలిన నష్టం పరిధిలోకి తీసుకోలేదు. 560 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 11 హెక్టార్లల్లో నువ్వు పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రాజుపాలెం మండలం కోటనెమలిపురి గ్రామంలో పాలుపోసుకునే దశలో ఉన్న వరి పంట తీవ్రంగా దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు