సాగునీటికి సొమ్ముల గండం
నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో గత నాలుగేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతు పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి.
నిధులు లేక మరమ్మతులకు నోచుకోని కాల్వలు
సాగర్ ఆయకట్టు పరిధిలో ఇదీ సంగతి
ఈనాడు - గుంటూరు
పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆనవాళ్లు కనిపించని అద్దంకి మేజరు కాలువ
నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో గత నాలుగేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతు పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఒకవైపు నీటితీరువా వసూలుకాకపోవడం, మరోవైపు గతేడాది చేసిన పనులకు బిల్లులు బకాయిలు ఉండటంతో ఈ ఏడాది కాలువల మరమ్మతు ప్రశ్నార్థకంగా మారింది. తాజా బడ్జెట్లో కేవలం రూ.2 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఈ సొమ్ము ఇప్పటికే చేసిన పనుల బకాయిలకు సరిపోతుందని, కొత్తగా పనులు చేసే పరిస్థితి లేదని జలవనరులశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈసారి కూడా కాలువలు మరమ్మతు చేయని పక్షంలో ఆయకట్టు చివరి భూములకు సాగునీటి కష్టాలు తప్పవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కనీస నిర్వహణ పనులు కూడా చేయకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కొన్నిచోట్ల కాల్వ కట్టలు కోతకు గురయ్యాయి. కాలువ లోపలి భాగంలోనూ పిచ్చిమొక్కలు, తూటుకాడ, గడ్డి పెరిగిపోయి మైనర్ కాలువల్లో నీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గతేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగుండటం, జలాశయంలో నీటిలభ్యత పుష్కలంగా ఉండటంతో నీటి కష్టాలు లేకుండా పంటలు గట్టెక్కాయి. ఈ ఏడాదైనా కాలువల మరమ్మతు చేస్తారని రైతులు ఆశిస్తున్నారు.
క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు
నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఉన్నాయి. ఎడమ కాలువ పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో సాగర్ కాలువలు ఉన్నాయి. కుడి, ఎడమ కాలువల కింద 12 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఆయా డివిజన్లలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలు పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేసి జలవనరులశాఖ ముఖ్య ఇంజినీరు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఒక్కొక్క డివిజన్ నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు మరమ్మతుకు నిధులు కావాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.15 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది చేసిన పనులకు ఇంకా రూ.5 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. నీటితీరువా కింద వసూలైన సొమ్ము కొంత ఉంది. ఇవి పాత బకాయిలకే సరిపోతే కొత్తగా పనులు చేసే పరిస్థితి లేదు. కడా కూడా రూ.34 కోట్లను కాలువల మరమ్మతుకు బడ్జెట్లో కేటాయించారు. ఈ నిధులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాజెక్టుల కింద ఖర్చు చేస్తారు. నీటితీరువా సొమ్ము లభ్యతను అనుసరించి కడా పనులకు అనుమతి మంజూరు చేస్తోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తే కానీ ఈ ఏడాది కాలువలు మరమ్మతు చేసే పరిస్థితి లేదని జలవనరులశాఖ ఇంజినీరు ఒకరు తెలిపారు.
ఇదే కీలక సమయం
నాగార్జున సాగర్ కాలువల మరమ్మతు పనులు కాలువల్లో నీటి ప్రవాహం లేనప్పుడు చేయాలి. ప్రస్తుతం కాలువల్లో మార్చి నెలాఖరు వరకు నీటి ప్రవాహం ఉండే అవకాశముంది. ఏప్రిల్, మే నెలల్లో కాలువలకు నీటిని కట్టేస్తారు. ఈ కాలం కాలువల మరమ్మతు చేయడానికి అనువైన సమయం. మార్చి నెలాఖరు నాటికి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి ప్రభుత్వానికి పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే ఏప్రిల్ తొలి వారంలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తే సకాలంలో పనులు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇందుకు ఇప్పటి నుంచి జలవనరులశాఖ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. జూన్ నెలలో తాగునీటి అవసరాలకు కోసం కాలువలకు నీటిని విడుదల చేయాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెలలోనే పనులు ప్రారంభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మరమ్మతు చేయకపోతే మేజరు, మైనరు కాలువల్లో నీరు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈ విషయమై జలవనరులశాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు