28, 29 తేదీల్లో దిల్లీలో మహాధర్నా, దీక్షలు
బీసీల కుల గణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దిల్లీలో ఈనెల 28న మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు, పక్కన క్రాంతికుమార్ తదితరులు
ఏటీ అగ్రహారం, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్టుడే: బీసీల కుల గణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దిల్లీలో ఈనెల 28న మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరు చుట్టుగుంటలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన చేపడతామని మాట ఇచ్చి భాజపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నప్పటికి కేంద్రంలో కనీసం చలనం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి దిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆందోళనలో దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని, భాజపా మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటరీ నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు మొదలై వారమవుతున్నా అదాని, రాహుల్ గాంధీల రాగం తప్ప, బీసీల సమస్యలపై కనీసం చర్చ జరగడంలేదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్, సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల శేషయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, సాంస్కృతిక కళామండలి రాష్ట్ర కన్వీనర్ ముప్పాన వెంకటేశ్వర్లు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు ద్వారకా శ్రీను, నాయకులు వెంకట్రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.