logo

‘మారని వైకాపా నేతల తీరు’

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పిన వైకాపా నేతల తీరు మారలేదని.. పవిత్ర శాసనసభలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.

Published : 21 Mar 2023 05:58 IST

చిలకలూరిపేటలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన

వినుకొండ, న్యూస్‌టుడే : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పిన వైకాపా నేతల తీరు మారలేదని.. పవిత్ర శాసనసభలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అధికారపార్టీ శాసనసభ్యులు దాడికి పాల్పడ్డారని సోమవారం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా శ్రేణులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. చిలకలూరిపేటలోని పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహన్ని జీర్ణించుకోలేక భౌతికదాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలపై అక్రమంగా కేసులు బనాయించే స్థాయి దాటి ఎమ్మెల్యేలపై దాడులకు తెగబడ్డారంటే వారి మానసిక స్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పీవీ సురేష్‌, సీనియర్‌ నేతలు గన్నమనేని వెంకయ్య, గోవిందునాయక్‌, పెమ్మసాని నాగేశ్వరరావు, రాపర్ల జగ్గారావు, దాసయ్య, ముండ్రు సుబ్బారావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని