పరమాన్నంతోనే పండగ
మన తొలి పండగ ఉగాదిని కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకుని సందడిగా జరుపుకుంటారు.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు
సామాన్యుల లోగిళ్లలో ఉగాది సందడి అంతంతే
ఈనాడు-నరసరావుపేట, బాపట్ల : మన తొలి పండగ ఉగాదిని కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకుని సందడిగా జరుపుకుంటారు. అయితే గ్యాస్ నుంచి కిరాణా సరకుల ధరలు పెరగడం, సామాన్యులకు ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో పండగ వేళ అన్ని వంటలు చేసుకోలేని పరిస్థితి. ఉగాది పచ్చడి ప్రసాదంతో ప్రారంభమై గారెలు, పూర్ణాలు, బొబ్బట్లు, పరమాన్నం, పప్పన్నం.. ఇలా పలు వంటకాలతో చేసుకునే పండగను కొన్ని వంటలకే పరిమితం అవుతున్నారు. వంట నూనెలు, నెయ్యి ధరలు పెరగడం, మినపగుళ్లు, కందిపప్పు, పెసరపప్పు, యాలకులు, జీడిపప్పు ధరలు పెరగడంతో అన్ని పిండి వంటలు చేసుకుని ఆస్వాదించలేకపోతున్నారు. మరోవైపు గత మూడు రోజులుగా కురిసిన అకాలవర్షాలతో పంటలు దెబ్బతిని కర్షకులు కుదేలయ్యారు. రైతులు, రైతుకూలీలు పొలాలు, కల్లాల్లోనే గడుపున్నారు. నగరాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంతోపాటు పలు రంగాల్లో ఆశించిన మేర ప్రగతి లేక కూలీలకు ఉపాధి కరవైంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆదాయాలు తగ్గిపోయి ఉన్నదాంట్లో సర్దుకునే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. దీంతో అన్ని రంగాల వారు పూర్తిస్థాయిలో పండగ చేసుకోలేని పరిస్థితి. ఉగాది పండగ రోజు పరమాన్నంతోనే సరిపెట్టుకుంటున్నామని సాధారణ కుటుంబీకులు నిట్టూరుస్తున్నారు.
ధరల దడ..
ఉగాది పండగకు ప్రధానంగా గారెలు వండుకుంటారు. అయితే నెల రోజుల వ్యవధిలో మినపప్పు కిలో రూ.105 నుంచి రూ.110కు ధర పెరిగింది. పెసరపప్పు కిలో రూ.110 నుంచి రూ.117కు, కందిపప్పు రూ.115 నుంచి రూ.125కు ధరలు పెరిగాయి. అన్ని వంటల్లో వాడే సుగంధ ద్రవ్యమైన యాలక్కులు జనవరిలో కిలో రూ.1600 ఉండగా, ప్రస్తుతం రూ.1800కు పెరిగింది. నాణ్యమైన నెయ్యి కిలో రూ.530 నుంచి రూ.630కు పెరిగింది. పామాయిల్ ప్యాకెట్ రూ.100, శనగనూనె రూ.170 ధర పలుకుతున్నాయి. ఉగాది పండగకు వండే పిండి వంటలకు అవసరమైన అన్ని రకాల కిరాణా ధరలు పెరగడంతో సామాన్యులు ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. చేతిలో సొమ్ము చూసుకుని ఒక్కొక్కటిగా ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. తాడికొండ మండలం నుంచి గుంటూరు నగరానికి రోజువారీ కూలీకి వచ్చే నారాయణ కొన్నాళ్లుగా సక్రమంగా పనులు దొరకకపోవడంతో పండగకు నూతన వస్త్రాలు కొనుగోలు చేయలేకపోయానని, పండగ కూడా ఏదోలా కానిచ్చేస్తున్నామని వాపోయారు. బియ్యం, బెల్లం, పాలుతో తయారయ్యే పరమాన్నం వండుకుంటే తక్కువ ఖర్చుతో పండగ అయిపోతుందంటున్నారు. రోజువారీ పనులు దొరికితే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కిరాణా, ఇతర సరకుల ధరలు కొంతమేర పెరిగినప్పటికీ ఆదాయం లేకపోవడం వల్ల ఎక్కువ మంది పండగ జరుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ధరలు కొంతమేర పెరిగినా ప్రభావం ఎక్కువగా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు సరకులు కొనుగోలు చేస్తున్నారని, గతంలో వలె పండగకు ప్రత్యేకంగా కొనుగోలుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు. అట్టడగు వర్గాల నుంచి మధ్య తరగతి వర్గాల వారికి ఆదాయం తగ్గిన ప్రభావం అన్ని వ్యాపారాలపై పడిందని గుంటూరుకు చెందిన వ్యాపారి ఒకరు విశ్లేషించారు. వ్యాపార కూడలిగా ఉన్న పట్నంబజారులో పండగ వేళ ఉండాల్సిన సందడి లేదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు