మేం చెల్లిస్తామన్నారు.. చేతులెత్తేశారు
గడప గడపకు-మన ప్రభుత్వ కార్యక్రమం కింద నగర, పురపాలికల్లో అధికార యంత్రాంగం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పనులు చేయించింది.
పనులు చేసి రెండు నెలలైనా పైసా ఇవ్వలేదన్న గుత్తేదారులు
రాజీవ్గాంధీ కాలనీలో నిర్మించిన సిమెంటు రహదారి
ఈనాడు-అమరావతి : గడప గడపకు-మన ప్రభుత్వ కార్యక్రమం కింద నగర, పురపాలికల్లో అధికార యంత్రాంగం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పనులు చేయించింది. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పనులు చేసి రెండు మాసాలు గడిచిపోయింది. వాటికి సంబంధించిన నిధులు పురపాలికల్లోనే ఉన్నా యంత్రాంగం మాత్రం చెల్లించడానికి మీనమేషాలు లెక్కిస్తోందని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. అసలు మంజూరు కావాలంటే ప్రొసీజర్ ప్రకారం ఇంజినీరింగ్ అధికారులు ఎంబుక్కు రికార్డు చేసి బిల్లులు ప్రతిపాదించాలి. అది చేయకుండా మొక్కుబడిగా బిల్లులు పెట్టారని అందువల్లే అవి సీఎఫ్ఎంఎస్-2 వెర్షన్లో అప్లోడ్ కావటం లేదని మున్సిపల్, పీఏఓ అధికారులకు సమన్వయం లేదని పర్యవసానంగా బిల్లులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయని గుంటూరు నగరంలో పనులు చేసిన గుత్తేదారులు చెబుతున్నారు. రెండు మాసాల క్రితమే పనులు చేస్తే రెండు రోజుల కిందట సుమారు రూ.3 కోట్లకు బిల్లులు పెట్టారని అవి తప్పులు తడకగా ఉన్నాయని వాటిని పీఏఓ అధికారులు తిరస్కరించారని వినికిడి. గుంటూరు నగరపాలకలోనే కాదు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక, తెనాలి, పొన్నూరు,.రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ పురపాలికల్లోనూ ఇదే పరిస్థితని అంటున్నారు. పనులు చేసే వరకు ఎమ్మెల్యేలు, అధికారులు తమపై ఒత్తిడి తీసుకొచ్చారనీ తీరా పూర్తిచేశాక బిల్లుల చెల్లింపు గురించి అడుగుతుంటే సీఎఫ్ఎంఎస్, పీఏఓలోనే బిల్లులు పాస్ కావాలని సాధారణ నిధుల నుంచి ఇవ్వటానికి నిబంధనలు అంగీకరించటం లేదని చెప్పి తప్పించుకుంటున్నారని అంటున్నారు. అత్యధికంగా గుంటూరు నగరపాలకలో రూ.15 కోట్లకు పైగా పనులు చేశారు. మిగిలిన పురపాలికల్లో మరో రూ.6-7 కోట్ల వరకు చేసిన పనులు ఉంటాయని సమాచారం.
సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున.. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులిస్తున్నామని ఆ విలువతో కూడిన పనులు పూర్తికాగానే తిరిగి చేస్తే మళ్లీ నిధులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనటంతో ప్రతి డివిజన్, వార్డులో రూ. 20 లక్షల నుంచి రూ.50-60 లక్షల వరకు పనులు జరిగాయి. కేటాయిస్తామని చెప్పిన రూ.20 లక్షల్లో 30 శాతం నిధులే తొలుత పురపాలికల ఖాతాలకు జమ చేశారు. అసలు ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులే సీఎఫ్ఎంఎస్కు ఎక్కలేదు.
రాష్ట్రంలోనే గుంటూరు నగరపాలకలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం కింద అత్యధిక పనులు చేశాం. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం అధికారులు ఇవ్వటం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నగరపాలక సాధారణ నిధుల నుంచి చెల్లిస్తాం. పనులు ప్రారంభించాలని నాడు కమిషనర్, పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) నమ్మబలికారు. ప్రస్తుతం వారెవరూ నోరుమెదపడం లేదు.
గుంటూరుకు చెందిన ఓ గుత్తేదారు
14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల బిల్లులే ఇప్పటి వరకు చెల్లించలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం కింద చేపట్టిన వాటికి చెలిస్తామంటే నమ్మశక్యం కావట్లేదు. అందుకే టెండర్లలో పాల్గొనలేదని చెబితే ఉన్నతాధికారి ఒకరు పిలిపించుకుని డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అంటూ నాడు ప్రగల్భాలు పలికారు. ఆయన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు నిబంధనల ప్రకారం సీఎఫ్ఎంఎస్-2 వెర్షన్లో బిల్లులే పెట్టలేదు. ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి.
ఇదీ మరో గుత్తేదారుడి వేదన
చెల్లించని మాట వాస్తవమే
బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. చెల్లించాలంటే తొలుత చేసిన పనులకు సంబంధించి ఎంబుక్కు రికార్డు చేయాలి. ఇవేం లేకుండా బిల్లులు పెడితే వెంటనే తిరస్కరిస్తున్నారని ఇంజినీరింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉమ్మడి గుంటూరులో ఏ పురపాలికలోనూ ఇప్పటివరకు చెల్లించిన దాఖలాలు లేవు. తామైతే నిధులకు సమస్యలేదని చెప్పి పనులు చేయించిన మాట వాస్తవమే. చేసిన పనులు ఎక్కువగా ఉండగా పురపాలికల్లో నిధులు తక్కువగా ఉన్నాయని అవి ఏ మూలకు సరిపోవని వెంటనే ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తేనే అందరికీ ఇవ్వడం సాధ్యపడదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం