స్వచ్ఛ సంకల్పంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా పంచాయతీల సర్పంచులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు.
మాట్లాడుతున్న జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ హెనీ క్రిస్టినా
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా పంచాయతీల సర్పంచులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. జడ్పీలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, ఐటీసీ, సెర్చ్, ఫినిష్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం అమలు, పారిశుద్ధ్యం మెరుగుగా నిర్వహించడంలో కృషి చేసిన ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందికి జగనన్న స్వచ్ఛ సంకల్పం పురస్కారాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన చేయకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని తెలిపారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే ప్రజల జీవన ప్రమణాలు పెరుగుతాయన్నారు. అధ్యక్షత వహించిన జడ్పీ సీఈవో మోహన్రావు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 8 పనులకు మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేయడానికి సర్పంచులు, వార్డు సభ్యులు ముందుకు రావాలని కోరారు. ఐటీసీ అనుబంధ సెర్చ్, ఫినిష్ సంస్థల రాష్ట్ర మేనేజరు గౌరీనాయుడు, ఐటీసీ ప్రోగ్రాం అధికారి సురేష్ మాట్లాడుతూ ప్రజలు మంచి వాతావరణంలో జీవించేలా చూసేందుకు ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉత్తమ సేవలు అందజేసిన అధికారులు, ఉద్యోగులను సన్మానిస్తున్నామన్నారు. అనంతరం జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టినా పురస్కారాలకు ఎంపికైన ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ధ్రువపత్రాలు అందజేశారు. సమావేశంలో జడ్పీ ఉపాధ్యక్షరాలు బత్తుల అనురాధ, డీపీఆర్సీ సమన్వయకర్త పి.ఎస్.పద్మాకర్, జడ్పీ ఇన్ఛార్జి ఏవో జి.శ్రీనివాసరావు, సెర్చ్ సంస్థ కార్యదర్శి సీహెచ్.పార్థసారథి, ఫినిష్ సంస్థ ప్రోగ్రాం మేనేజరు ఖాజావలి, ఉద్యోగులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ