శోభాయమానం.. సాహితీ వసంతోత్సవం
సంగీత, సాహిత్య, చిత్రలేఖన, నటనాలంకృతంగా సాగిన సభ సరస ఛలోక్తుల సుమగంధాలతో గుబాళించింది. శోభకృత్ ఉగాది నాడు కవులు, గాయకులు కోయిలలై కవితా రసగానంతో ప్రేక్షకులను పులకింపజేశారు.
శ్రీనివాసాచార్యకు సాహితీ సమాఖ్య పురస్కారం అందజేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు,
చిత్రంలో కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, నాగఫణిశర్మ, డాక్టర్ గురువారెడ్డి, గజల్ శ్రీనివాస్ తదితరులు
గుంటూరు సాంస్కృతికం, న్యూస్టుడే: సంగీత, సాహిత్య, చిత్రలేఖన, నటనాలంకృతంగా సాగిన సభ సరస ఛలోక్తుల సుమగంధాలతో గుబాళించింది. శోభకృత్ ఉగాది నాడు కవులు, గాయకులు కోయిలలై కవితా రసగానంతో ప్రేక్షకులను పులకింపజేశారు. చిత్ర లేఖకుని కుంచె.. గాయని కంఠస్వరానికి పులకిస్తూ కదిలి చిత్రాన్ని ఆవిష్కరించింది. ఆశు కవితా ధారలు సాహిత్యామృత ధారలయ్యాయి. తెలుగు గజల్స్ కవన మమూరాలై నర్తించాయి. మొత్తంగా సాహితీ వసంతోత్సవం మధుమాస మధురిమలను పంచింది. శోభకృత్ స్వాగత వేళ ఈ సంప్రదాయ కవితా హేల గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం రాత్రి పల్లవించింది. గుంటూరు సాహితీ సమాఖ్య 26వ సాహితీ వసంతోత్సవ సంరంభ సభలో కవులు, కళాకారులు, పాలనాధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. నాదస్వర కచేరీ, వేదస్వస్తి, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలన్నీ అచ్చ తెలుగు వాతావరణం శోభిల్లుతూ కనిపించిన వేదికపై కదలాడుతూ కన్నార్పనివ్వలేదు. గుదిమెళ్ల కూర్మనాథ స్వామి పంచాంగ పఠనం చేశారు.
ఆత్మీయ పురస్కారం అందుకుంటున్న బీఎస్ శర్మ, రేటూరి గాయత్రి
సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ డీవీఎస్బీ రామ్మూర్తి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. జానపద సాహిత్య పరిశోధకుడు భాస్కరయోగి జానపద సాహిత్యం, వైదిక సాహిత్యంలోని అంశాలను వివరించిన తీరును పాటలు పాడి వినిపించారు. సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ ఎస్.వి.గురవారెడ్డి తెలుగు సాహిత్యంలో హాస్యరస సన్నివేశాల గురించి చెపుతూ మునిమాణిక్యం, భమిడిపాటి, విశ్వనాథ, చిలకమర్తి, పానుగంటి తదితరుల రచనల్లోని హాస్య సన్నివేశాలను ఉదహరిస్తూ తన స్వానుభవ సన్నివేశాలను, గుంటూరుతో తన అనుబంధాన్ని హాస్యస్ఫోరకంగా వివరించారు. అనంతరం సుప్రసిద్ధ చిత్రకారుడు కూచి.. ‘ఈటీవీ పాడుతా తీయగా’ విజేత రేటూరి గాయత్రి పాడిన స్వాగతం కృష్ణా, హైలో హైలెస్సా పాటలను పాడుతున్న సమయంలోనే ఆయా పాటల సారాన్ని వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించి ఆశ్చర్యపర్చారు. బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ తనదైన శైలిలో పరవళ్లు తొక్కే ఆశు పద్య ధారతో గజల్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఉగాది పండగ కోసం రాసిన గజల్స్తో పాటు మరికొన్నిటినీ పాడి పరవశింపజేశారు. ఈ సందర్భంగా శోభకృత్ ఉగాది పురస్కారాన్ని దర్భశయనం శ్రీనివాసాచార్యకు, ఆత్మీయ పురస్కారాన్ని బీఎస్ శర్మకు ఇచ్చి సత్కరించారు. అతిథులుగా జిల్లా పాలనాధికారి వేణుగోపాలరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎన్ఎస్ సోమయాజులు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ పురస్కార ప్రదానంలో పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు తమ కవితలను వినిపించారు. రాత్రి పది గంటలు దాటే వరకు సభ సాహితీ సేద్యం చేస్తూనే ఉంది.
గాత్రానికి అనుగుణంగా చిత్రం గీస్తున్న కూచి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్