ప్రయోగాత్మక పంటల సేద్యంతో సత్ఫలితాలు
రైతులు మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా పంటలను సేద్యం చేసినట్లయతే సత్ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎ.విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.
ఉగాది వేడుకల్లో ఆంగ్రూ వీసీ విష్ణువర్ధన్రెడ్డి
ఉగాది పురస్కారాలు పొందిన ఉత్తమ రైతులు
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: రైతులు మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా పంటలను సేద్యం చేసినట్లయతే సత్ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎ.విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ శాస్త్రవేత్తలతో సమానంగా రైతులు కూడా పరిశోధనాత్మకంగా పంటలను సేద్యం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ రైతులు, ఉపాధ్యాయులుగా ఎంపికయిన పురస్కార గ్రహీతలను వీసీ విష్ణువర్ధన్రెడ్డి జ్ఞాపికలు, దుశ్శాలువాలతో సన్మానించారు. రూ.5 వేల నగదు చెక్కు కూడా అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.రామరావు, విభాగాల అధిపతులు ఎల్.ప్రశాంతి, బి.విజయాభినందన, ఎ.మణి, సీహెచ్.చిరంజీవి, పి.సాంబశివరావు, ఎ.వి.రమణ, లాంఫాం ఏడీఆర్ జి.సుబ్బారావు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. 2022-23 ఉత్తమ రైతులు, ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన వారి వివరాలివీ.
ఉత్తమ ఉపాధ్యాయులతో ఆంగ్రూ వీసీ విష్ణువర్ధన్రెడ్డి
ఉత్తమ రైతులు: పి.వరాహనరసింహం (శ్రీకాకుళం జిల్లా, సర్బులిజి మండలం, నక్కలపేట), ఎస్.రఘునాథ్(అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట), జి.నాగబాబు (గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు), ఎల్.సదాశివారెడ్డి (వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం వెదురూరు రాజుపాలెం), డి.మద్దయ్య (కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం సోమయాజులపల్లి).
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు: డాక్టర్ జి.కృష్ణారెడ్డి(తిరుపతి ఎస్.వి.వ్యవసాయ కళాశాల సేద్యశాస్త్రం ఆచార్యులు), డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం(ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం సేద్యశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త), డాక్టర్ పి.సుజాతమ్మ(బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త, సేద్య శాస్త్రం ప్రోగ్రాం సమన్వయకర్త), డాక్టర్ జి.బిందుమాధవి (ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ సాంకేతిక అధికారి), డాక్టర్ ఎం.శ్రీనివాస్(మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్యశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త), డాక్టర్ పి.కిషోర్వర్మ(ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం మొక్కల తెగుళ్ల శాస్త్రం సీనియర్ శాస్త్రవేత్త), డాక్టర్ జి.వి.సునీల్కుమార్(ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త కీటకశాస్త్రం).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు