భక్తి.. ప్రేమ.. త్యాగం..సమ్మిళితమే రంజాన్
నిర్వహించే అతి పెద్ద పండగ, పవిత్ర రంజాన్ మాస శుభగడియలు సమీపించాయి. నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభం కానుంది.
పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు
మసీదులకు విద్యుత్తు దీపాల అలంకరణ
తెనాలి టౌన్, న్యూస్టుడే
ప్రత్యేక వెలుగుల్లో తెనాలి జామియా మసీదు మినార్లు
నిర్వహించే అతి పెద్ద పండగ, పవిత్ర రంజాన్ మాస శుభగడియలు సమీపించాయి. నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభం కానుంది. రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు మసీదులు విద్యుత్తు వెలుగులతో మెరిసిపోతున్నాయి. సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ మానవాళికి దివ్య ఖుర్ఆన్ అందించిన నెలే రంజాన్.
ప్రాథమిక విధుల్లో ప్రాధాన్యం
ప్రతి ముస్లిం 5 ప్రాథమిక విధుల ద్వారా ఇస్లాంలో ముందుకు పయనిస్తారు. కలిమా చదవడం, ప్రతిరోజూ 5 సార్లు నమాజ్ చేయటం, రంజాన్ నెలలో ఉపవాసం, తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయటం(జకాత్), హజ్ చేయటం ఈ విధులు. వీటిల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉపవాసాల నెలే రంజాన్. నెల రోజుల ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందన్నది వారి విశ్వాసం.
ఉపవాసం అందరి విధి
పవిత్ర ఖుర్ఆన్ ప్రకారం ప్రతి ముస్లిం రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం విధి. ప్రాపంచిక విషయాలపై అవగాహన కలిగిన పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని తప్పనిసరిగా పాటించాలి. అనారోగ్యంతో బాధపడేవారు, బాలింతలు, నెలసరిలో ఉన్న మహిళలు, గర్భిణులకు మినహాయింపు ఉంది. అయితే వారు కూడా తమ, తమ సమస్యలు తీరిన తర్వాత ఖజా ఉపవాసాలు ఉండాలి.
ఆధ్యాత్మిక జీవన విధానంపై శిక్షణ
ఉపవాసం సందర్భంగా శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచుకుని ఉదయం సూర్యోదయం లోపల, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం ప్రదాన విషయం. ఉపవాసం ఆచరిస్తున్న సమయంలో అసత్యం పలకరాదు, అధర్మంగా ప్రవర్తించరాదు. దైవంపై ప్రేమ అధికమవుతుంది. తదుపరి జవితానికి ఈ నెల ఒక ‘శిక్షణ’గా ఉపయోగపడుతుంది. రంజాన్ నెల ప్రధాన ధ్యేయం ఇదే.
జకాత్, ఫిత్రా తప్పనిసరి
దానం చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం తన మిగులు సంపాదనలో కొంత పేదవారికి పంచిపెట్టడమే జకాత్. ధన వ్యామోహాన్ని దూరం చేయడం, పేద వారు కూడా పండగను సంతోషంగా చేసుకోవటానికే అల్లాహ్ జకాత్ను తప్పనిసరి చేశారు. ఇది ఏటా కొనసాగాలి. అదే విధంగా అప్పుడే పుట్టిన బిడ్డతో సహా అందరూ ఫిత్రాను పేదవారికి ఇవ్వాలి.
ఎతికాఫ్
రంజాన్ నెలలో మరో పవిత్ర అంశం ఎతికాఫ్. ఈ నెలలో చివరి పది రోజులు కుటుంబాన్ని తాత్కాలికంగా వదిలి మసీదుల్లో దైవ ప్రార్థనలతో గడపటమే ఎతికాఫ్. అతి పవిత్రమైన లైలతుల్ఖద్ర్ ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసంలోని 27వ రోజు రాత్రిని పుణ్యరాత్రిగా పరిగణిస్తారు. ఆ రాత్రి జాగారం ఉండి, దైవ ప్రార్థనలో గడుపుతారు. నెల రోజుల పాటు చదివిన ఖుర్ఆన్ చివరి అంకాన్ని ఈ రాత్రి ముగిస్తారు. అల్లాహ్ కృప కోసం ప్రత్యేకంగా దువా చేస్తారు.
* ఈ ఏడాది మార్చి 23న రంజాన్ నెల వంక దర్శనం ఇస్తే అదే రోజు రాత్రి ప్రత్యేక తరావీ నమాజ్లు మొదలవుతాయని, శుక్రవారం తొలి ఉపవాసం అవుతుందని తెనాలికి చెందిన ముఫ్తీ అల్లాఉద్దీన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు